ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC : మహిళల క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా 2026లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ప్రైజ్ మనీని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుండగా.. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్గా నిలవనుంది. ఈసారి మొదటిసారిగా 12 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇంగ్లాండ్ లోని ఏడు వేదికల్లో మొత్తం 33 మ్యాచ్లు నిర్వహించనున్నారు.
విజేతకు రూ.22 కోట్లకుపైగా :
ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. 2026 మహిళల టీ20 ప్రపంచకప్ విజేత జట్టుకు 2.34 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.22 కోట్లకుపైగా) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. రన్నరప్ జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.11 కోట్ల బహుమతి లభించనుంది. అలాగే టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు 247,500 డాలర్లు (రూ.2 కోట్లు) అందజేయనున్నారు. సెమీఫైనల్ దశలో ఓడి నిష్క్రమించే జట్లకు కూడా నిరాశ ఎదురుకాకుండా దాదాపు రూ.6.56 కోట్ల బహుమతి ఇవ్వనున్నారు.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
లీగ్ మ్యాచ్లకూ ప్రత్యేక బోనస్:
నాకౌట్ మ్యాచ్లకే కాకుండా లీగ్ దశలో కూడా జట్లకు ప్రోత్సాహక నగదు బహుమతులు ప్రకటించింది ఐసీసీ. గ్రూప్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన జట్టుకు సుమారు రూ.29 లక్షల బోనస్ అందజేయనుంది. దీంతో ప్రతి మ్యాచ్కు మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టు, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఈసారి తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. టైటిల్ ఫేవరెట్ జట్లలో భారత్ ఒకటి.
మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారి 12 జట్లు పోటీపడుతున్నాయి. గతంలో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, ఈసారి టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూపులు:
గ్రూప్-1: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్.
గ్రూప్-2: ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!