ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC : మహిళల క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా 2026లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ప్రైజ్ మనీని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుండగా.. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్గా నిలవనుంది. ఈసారి మొదటిసారిగా 12 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇంగ్లాండ్ లోని ఏడు వేదికల్లో మొత్తం 33 మ్యాచ్లు నిర్వహించనున్నారు.
విజేతకు రూ.22 కోట్లకుపైగా :
ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. 2026 మహిళల టీ20 ప్రపంచకప్ విజేత జట్టుకు 2.34 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.22 కోట్లకుపైగా) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. రన్నరప్ జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.11 కోట్ల బహుమతి లభించనుంది. అలాగే టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు 247,500 డాలర్లు (రూ.2 కోట్లు) అందజేయనున్నారు. సెమీఫైనల్ దశలో ఓడి నిష్క్రమించే జట్లకు కూడా నిరాశ ఎదురుకాకుండా దాదాపు రూ.6.56 కోట్ల బహుమతి ఇవ్వనున్నారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
- Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి 'పాడే యాత్రే'.!
- Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
లీగ్ మ్యాచ్లకూ ప్రత్యేక బోనస్:
నాకౌట్ మ్యాచ్లకే కాకుండా లీగ్ దశలో కూడా జట్లకు ప్రోత్సాహక నగదు బహుమతులు ప్రకటించింది ఐసీసీ. గ్రూప్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన జట్టుకు సుమారు రూ.29 లక్షల బోనస్ అందజేయనుంది. దీంతో ప్రతి మ్యాచ్కు మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టు, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఈసారి తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. టైటిల్ ఫేవరెట్ జట్లలో భారత్ ఒకటి.
మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారి 12 జట్లు పోటీపడుతున్నాయి. గతంలో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, ఈసారి టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూపులు:
గ్రూప్-1: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్.
గ్రూప్-2: ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్.
తాజావార్తలు
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
-
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి ‘పాడే యాత్రే’.!
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ