Somesh Kumar: ఏపీలో ఏ పోస్ట్ ఇస్తారు.. వీఆర్ఎస్ కి అప్లై చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ విజయవాడకు చేరుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అవుతున్నారు. అనంతరం 11 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు సోమేష్ కుమార్. అయితే ఆయన ఏపీలో రిపోర్ట్ చేశాక ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. అయితే ఆయన వీఆర్ఎస్ తీసుకుంటారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే తనకు వీఆర్ఎస్ కు తొందర లేదు అన్నారు సోమేష్ కుమార్. కుటుంబసభ్యులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానంటున్నారు. డీవోపీటీ ఆదేశాలను గౌరవిస్తూ ఏపీలో రిపోర్ట్ చేస్తున్నా అన్నారు. ఏపీ సీఎస్ను కలిశాక నిర్ణయం తీసుకుంటానన్నారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తో భేటీ అయ్యారు సోమేశ్ కుమార్. విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. . సోమేశ్ కుమార్ సేవలను ముఖ్యమంత్రి జగన్ ఏ రకంగా ఉపయోగించుకోనున్నారనే అంశం పై ఆసక్తి ఏర్పడింది. సీఎంతో భేటీ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్హౌస్లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్ కి ఏ పోస్టు కేటాయిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్ను ఇక్కడి విధుల నుంచి రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. సోమేశ్కుమార్ను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా.. వెంటనే ఏపీ గవర్నమెంట్కు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.
Read Also: Himachal Pradesh: మంత్రిత్వ శాఖలు కేటాయించిన సీఎం సుఖు.. ఎవరికి ఏం ఇచ్చారంటే?
అయితే.. సోమేష్ కుమార్ మరో ఏడాదిలో రిటైర్ కానున్నారు. అయితే.. ఏపీకి వెళ్లేందుకు సోమేశ్ కుమార్ విముఖతగా ఉన్నట్లు.. ఈ క్రమంలోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దగ్గర ఏదో ఒక పోస్టులో ఉంటారనే ప్రచారం కూడా సాగింది..మూడు సంవత్సరాలకు పైగా అత్యున్నత పదవిలో పనిచేసిన సోమేష్ కుమార్.. ఆంధ్ర ప్రభుత్వంలో చేరడం ద్వారా సానుకూల సంకేతం పంపారని చివరి వరకు.. అంటే పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు సేవ చేయాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్హౌస్లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!