Himachal Pradesh: మంత్రిత్వ శాఖలు కేటాయించిన సీఎం సుఖు.. ఎవరికి ఏం ఇచ్చారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్కు పబ్లిక్ వర్క్స్, యువజన, క్రీడా శాఖల బాధ్యతలు ఇవ్వడంతో సహా మంత్రులకు శాఖలను కేటాయించారు. విక్రమాదిత్య సింగ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు. అతని తల్లి ప్రతిభా సింగ్, లోక్సభ నియోజకవర్గం మండి నుంచి పార్లమెంటు సభ్యురాలు.
ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సలహా మేరకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ శాఖలను పంపిణీ చేశారు. ఆర్థిక, హోం, ప్లానింగ్, సిబ్బంది, ఇతర ఏ ఇతర మంత్రికి కేటాయించని అన్ని శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకోగా, జలశక్తి విభాగం, రవాణా భాషా కళలు, సంస్కృతిని ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రికి అప్పగించారు. సోలన్ నియోజకవర్గానికి చెందిన ధని రామ్ షాండిల్కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారత, కార్మిక, ఉపాధి శాఖల బాధ్యతలు అప్పగించారు. ధనిరామ్ షాండిల్ గతంలో కూడా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా చేశారు.
Also Read
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
Extreme Cold: విపరీతమైన చలి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది..
కాంగ్రాలోని జవళి నియోజకవర్గం ఎమ్మెల్యే చందర్ కుమార్కు వ్యవసాయం, పశుసంవర్ధక శాఖలు.. సిర్మౌర్కు చెందిన హర్షవర్ధన్ చౌహాన్కు పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాలు, ఆయుష్ శాఖలను అప్పగించారు. గిరిజన కిన్నౌర్ జిల్లాకు చెందిన జగత్ సింగ్ నేగికి రెవెన్యూ, ఉద్యానవన, గిరిజనాభివృద్ధి శాఖలు.. సిమ్లా జిల్లాకు చెందిన రోహిత్ ఠాకూర్కు ఉన్నత, ప్రాథమిక, సాంకేతిక విద్య, వృత్తి, పారిశ్రామిక శిక్షణ శాఖలు లభించాయి.
డిసెంబర్ 8న జరిగిన హిమాచల్ ప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ పోరులో మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లకే పరిమితమైంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అయితే, ఓట్ల శాతం పరంగా రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 1 శాతం కంటే తక్కువ.
తాజావార్తలు
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?