ఫార్ములా ఈ కార్ రేస్ లో నిందితుడుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పటికే అరవింద్ కుమార్ ని ప్రాసికూట్ క్యూట్ చేయడానికి కేంద్రం అనుమతించింది. అరవింద్ కుమార్ పై ఈ కార్ రేస్ కు సంబంధించి అవినీతి ఆరోపణలు.. అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Also Read:Land Dispute: బాపట్ల ఎస్పీ ఫ్యామిలీ భూకబ్జా.. కొనసాగుతున్న విచారణ
విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ కొనసాగనున్నది. ఇప్పటికే ఈ కేసు లో క్రిమినల్ కేసు నమోదు కాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నది ఏసీబీ. రెండు రోజుల క్రితం ప్రభుత్వం చేసిన ఐఏఎస్ బదిలీల్లో అరవింద్ కుమార్ ను వెయిటింగ్ లో ఉంచిన ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసింది.