IAS Amoy Kumar : ఈడీ ఆఫీసుకు ఐఏఎస్ అమోయ్ కుమార్ బాధితులు
- ఐఏఎస్ అమోయ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఈడీ ఆఫీసుకు పలువురు బాధితులు
- ధరణి పోర్టల్ ద్వారా తమ ప్లాట్లను వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణ
- ఇప్పుడు ఓనర్లమైన తమను ప్లాట్ల దగ్గరికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు బాధితులు హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఈడీ అధికారులను కలిశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన అమోయ్ కుమార్ పై రంగారెడ్డి జిల్లా వట్టినపులపల్లిలోని… శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని 460 ఎకరాల్లో… 3,333 ప్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు లక్ష్మీ కుమారి, కృష్ణారెడ్డి లు తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా తమ ప్లాట్ లను వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఇప్పుడు ఓనర్లమైన తమను ప్లాట్ల దగ్గరికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు.
KTR : ఇది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
మాజీ మంత్రి అండతో తమ ప్లాట్ లను వ్యవసాయ భూమిగా చిత్రీకరించి… విద్యుత్ పర్మిషన్ తీసుకొని కబ్జా చేశారని తెలిపారు. కేటిఆర్ స్నేహితుల కంపెనీలు అయిన ఫోనెక్స్, శ్రీనిధి కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపించారు. అప్పటి మంత్రి ప్రోద్భలంతోనే కలెక్టర్ అమోయ్ కుమార్ స్థలాల బదలాయింపు చేశారని పేర్కొన్నారు. అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు సుమారు 200 ఎకరాల తమ ఫ్లాట్ లను వేరే వారికి రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు. తమ స్థలాన్ని గత ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు , బ్యూరోక్రాట్స్ ఉన్నారని… వేల కోట్లు విలువ చేసే తమ ప్లాట్ లను తమకు ఇప్పించాలని… అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
UP: ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. వివాహిత ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన ప్రేమికుడు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!