Pawan Kalyan: నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. ఏ వ్యూహం అయినా వేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురం రావడం తాను చేసుకున్న అదృష్టమని.. దశాబ్ద కాలంగా మీ భవిషత్తు కోసం నిలబడ్డానని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ నాయకులు మాటలు విని కూడా మన వారికి సిగ్గు రాలేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో తన రెండు చెప్పులు బయట వదిలి వెళ్తే ఎవరో కొట్టేశారని అన్నారు. అందుకే వైట్ అండ్ వైట్ లాల్చికి బదులుగా కలర్ మార్చాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం చివరికి చెప్పులు కొట్టేసే స్థాయికి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Harish Rao : దేశంలో మూడు రకాల చెత్తను వేరు చేసే ఒకే ఒక్క పట్టణం సిద్దిపేట
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిని పిచ్చి వాళ్ళను చేశారని.. ఈ చచ్చు ప్రభుత్వం హిందు దేవాలయాలపై దాడిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాకినాడ ఎమ్మెల్యే లాగా తాను రోజుకి రెండు కోట్ల మట్టిని తోలనని ఆరోపించారు. ఎంపీ కొడుకును, భార్యను కిడ్నాప్ చేస్తే ఏమి చేశారని పవన్ ప్రశ్నించారు. క్రిమినల్స్ను వెనుక వేసుకుని వస్తారని ఆరోపణలు చేశారు. అమ్మ వారి సాక్షిగా ఆంధ్రని విడిచి వెళ్లనంటూ పవన్ ప్రతిజ్ఞ చేశారు. గూండా గాళ్ల కాళ్ళు, కీళ్లు విరగ గొడతానన్నారు. తిరుపతిని దోపిడీ చేస్తున్నారు..ఏడు కొండలతో ఆటలు ఆడితే నామ రూపాలు లేకుండా పోతారని పవన్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే పిఠాపురంని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దుతామన్నారు. హిందు దేవాలయాల మీద ఈ ప్రభుత్వం కన్ను వేసిందని.. తిరుపతి శ్రీ వాణి ట్రస్ట్లో దోపిడీ జరుగుతోందని పవన్ ఆరోపించారు.
Also Read: Bombay Highcourt: హిజ్రాలకు ఆ పని చేసేందుకు అనుమతి ఇవ్వలేం.. చట్టం తెస్తే తప్ప సాధ్యం కాదు
వ్యవసాయ శాఖ మంత్రి తనకు ఎన్ని రకాలు ధాన్యాలు ఉన్నాయో తెలుసా అంటున్నారని.. పుట్టగానే అందరికి అన్నీ తెలుస్తాయా అంటూ పవన్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ భగవంతుడికే భయపడతాడన్నారు. మన కులపోడు అని కాదు.. సరైనోడా కాదా అని చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనకు అధికారం ఇవ్వాలంటూ ప్రజలను పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు. తాను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాను గెలవడానికి ఏ వ్యూహం అయినా వేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
పిచ్చి వాగుడు వాగితే బయటకు తీసుకు వచ్చి కొడతానని.. జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత గూండాలకు నరకం చూపిస్తానన్నారు. 2019 లో ఈ విషయం స్పష్టంగా చెప్పలేకపోయానని పవన్ గుర్తు చేశారు. అమిత్ షా దగ్గర కాకినాడ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుల రిపోర్ట్ ఉందని.. అందుకే వైజాగ్లో అమిత్ షా మాట్లాడారన్నారు. నా ప్రాణానికి రక్షణ అవసరం లేదని రివాల్వర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామ సచివాలయంలో ఆడపిల్లలను ఏడిపిస్తున్నారు.. ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి తాట తీస్తానన్నారు పవన్ కళ్యాణ్.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..