Bombay Highcourt: హిజ్రాలకు ఆ పని చేసేందుకు అనుమతి ఇవ్వలేం.. చట్టం తెస్తే తప్ప సాధ్యం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay Highcourt: ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో , విద్యా ఉపాధి అవకాశాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని బాంబే కోర్టును ఆశ్రయించిన వినాయక్ కాశీద్ అనే పిటిషనర్ తరపున వాదనలు విన్న కోర్టు లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే అధికారం తమ పరిధిలో లేదని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టులో ఉన్న సమస్యల వివరణ దృష్ట్యా విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్జెండర్లకు అదనపు రిజర్వేషన్లు కల్పించడం కష్టమని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. మహరాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ డాక్టర్ బీరేంద్ర సరాఫ్ ఇప్పటికే వివిధ కులాల, వర్గాల వారీగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నందున కొత్తగా అదనపు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని కోర్టుకు విన్నవించారు. హిజ్రాలు ఆయా వర్గాలకు చెందిన కేటగిరీల్లో రిజర్వేషన్లు పొందే అవకాశం ఉన్నందున కొత్తగా అదనపు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
Also Read: Viral News: విమానంలోకి పెద్ద పక్షి.. ఫైలట్ ముఖం నిండా రక్తం.. అయినా సరే..!
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
ఇప్పటికీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు రూపొందించలేదని సరాఫ్ బాంబే హైకోర్టుకు విన్నవించారు. కాగా కర్ణాటకలో అన్ని కులాల్లో 1 శాతం అదనపు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కావున మహరాష్ట్రలో హిజ్రాలకు అదనపు రిజర్వేషన్ కల్పించడంలో సాధ్యాసాధ్యాలతో పనిలేదని పిటిషనర్ తరపు న్యాయవాది క్రాంతి కోర్టుకు విన్నవించారు. లింగమార్పిడి వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం 2019ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసిందని గుర్తు చేశారు. లింగ మార్పిడి వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చి 3, 2023న కొన్ని తీర్మానాలు చేసిందని అంతే కాకుండా సామాజిక న్యాయ శాఖ ఆధ్వర్యంలో 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ అంశాన్ని పరిశీలిస్తుందని సరాఫ్ సమర్పించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం లింగ మార్పిడి వ్యక్తులకు, హిజ్రాలకు రిజర్వేషన్లు కల్పించడం తమ పరిధిలో లేదని, కమిటీ ముందు తమ అభిప్రాయాలు తెలియజేయాలని, ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి, చట్ట పరిధిలోకి వచ్చినపుడు మాత్రమే కోర్టులు ఆదేశించగలవని తెలిపారు. ఈ విషయాన్ని కమిటీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ధర్మాసనం సూచించింది. లింగమార్పిడి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని సంప్రదించాలని పిటిషనర్ను కోర్టు కోరింది.
తాజావార్తలు
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..