Hyundai Motor India IPO: ఇన్వెస్టర్లకు షాక్.. ఊహించిన దాని కంటే తక్కువగా మార్కెట్లోకి ఎంట్రీ
- ఇన్వెస్టర్లకు షాక్..
- ఊహించిన దాని కంటే తక్కువగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన 'హ్యుందాయ్ మోటార్ ఇండియా'.
- ఒక్కో షేరుకు రూ. 1931 గా లిస్ట్ అయ్యింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Motor India IPO: భారతదేశపు అతిపెద్ద ఐపిఓ రూ.27,870 కోట్ల ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ స్టాక్ మార్కెట్లో నిరుత్సాహకర లిస్టింగ్తో మొదలైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ లిస్టింగ్ ఈ రోజు (అక్టోబర్ 22) న దేశీయ మార్కెట్లో నష్టాలతో మొదలైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు బిఎస్ఇ, ఎన్ఎస్ఇలో నష్టాలలో ప్రారంభమయ్యాయి. హ్యుందాయ్ మోటార్ షేర్ ధర అంచనా కంటే తక్కువతో లిస్టింగ్ అయ్యింది. ప్రారంభమైన తర్వాత కూడా స్టాక్ దాదాపు 3% కంటే ఎక్కువ పడిపోయింది. ఈ ఐపిఓకు 2.37 శాతం సబ్స్క్రైబ్ చేయబడింది.
Read Also: Gold Rate Today: పెరుగుదలకు నో బ్రేక్.. 80 వేలకు చేరువైన బంగారం!
Also Read
- Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ భారతీయ ఆర్మ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ స్టాక్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ఈ రోజు ఉదయం 10 గంటలకు హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు ఒక్కో షేరుకు రూ. 1,931 గా లిస్ట్ అయ్యింది. దాని ఇష్యూ ధర నుండి 1.5% తగ్గింపుతో జాబితా చేయబడ్డాయి. ఈ షేరు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రూ.1,931 స్థాయిలో లిస్ట్ కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఒక్కో షేరు ధర రూ.1,934గా నమోదైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆటో రంగంలో ఐపీఓ వచ్చింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ యొక్క ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.1,934.
Read Also: Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి.. ఫ్యాన్స్కు షాకిచ్చిన భామ..?
27,870.16 కోట్ల ఈ ఐపీఓ ఇప్పటి వరకు భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ. హ్యుందాయ్ ఐపీఓ అక్టోబరు 15న బిడ్డింగ్ కోసం తెరవబడింది. ఈ బిడ్లు అక్టోబర్ 17న ముగిశాయి. ఇష్యూ తెరవడానికి చాలా రోజుల ముందు, గ్రే మార్కెట్ ధర (GMP) రూ. 570కి చేరుకుంది. దీని తర్వాత, సబ్స్క్రిప్షన్ కోసం ఇష్యూ తెరిచిన రోజున GMP రూ.63కి పడిపోయింది. ఇష్యూ ముగింపు రోజున GMP క్యాప్ ధర కంటే రూ. 32 తగ్గింది. దీని తర్వాత మళ్లీ జీఎంపీ పెరిగి రూ.95కి చేరింది.
తాజావార్తలు
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?