Hydra Marshals: వీక్ ఆఫ్ ఇవ్వడం లేదు.. అధికారులు అరేయ్, ఒరేయ్ అంటున్నారు!
- విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్
- హైదరాబాద్ నగరంలో నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు
- 45 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్
- అధికారులు గౌరవం ఇవ్వడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydra Marshals Comments on Salary Cuts: హైడ్రా మార్షల్స్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వేతనాలు తగ్గించడంతో ఆగ్రహించిన మార్షల్స్.. నేడు తమ విధులను బహిష్కరించారు. దాంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోవడంతో పాటు 51 హైడ్రా వాహనాలు కూడా ఆగిపోయాయి. నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. విధుల బహిష్కరణపై మార్షల్స్ స్పందించారు. తమ డైరెక్టర్ జనరల్ ఆదేశాల ప్రకారం తమకు రూ.45 వేలు జీతం ఇవ్వాలని, ఇక్కడ చాలా తక్కువ జీతం ఇస్తున్నారన్నారు. ఇచ్చేది తక్కువ అంటే.. ఇప్పుడు మరలా తగ్గించడం దారుణం అని పేర్కొన్నారు. తమకు సరిపడ జీతం ఇస్తేనే పని చేస్తాం అని మార్షల్స్ స్పష్టం చేశారు.
‘మాకు హైడ్రా నుంచి పే స్కేల్ రూ.22500 అని జీఓ వచ్చింది. మొన్నటి వరకు రూ.29000 జీతం వచ్చేది. దానిపై మాట్లాడానికి రంగనాథ్ గారిని కలవడానికి వచ్చాము. మేము ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాము కాబట్టి పెన్షన్ వస్తుంది. కానీ కొందరు మా పెన్షన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము దేశానికి చేసిన సేవను గుర్తించి పెన్షన్ ఇస్తున్నారు. కూలీ పని చేసుకునే వాళ్లకు కూడా జీతం పెరుగుతుంది.. మాకు ఇచ్చే జీతం తగ్గించారు. మాకు సరైన గౌరవం ఇవ్వాలి. మాన్సూన్ ఎమర్జెన్సీ అని కనీసం వీక్ ఆఫ్ ఇవ్వడం లేదు. పైగా గౌరవం ఇవ్వడం లేదు. కొందరు అధికారులు రెస్పెక్ట్ ఇవ్వకుండా.. అరేయ్, ఒరేయ్ అంటున్నారు. మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటాదని గుర్తుంచుకోవాలి’ అని మార్షల్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
Also Read: Bhatti Vikramarka: ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత!
‘కరోనా సమయంలో ఎవ్వరూ ఇంటి నుండి బయటకు రాలేదు. కానీ మేము ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చి పని చేశాం. మా సేవకు గుర్తింపుగా జీతాలు పెంచడం పోయి, తగ్గించారు. మా డైరెక్టర్ జనరల్ ఆదేశాల ప్రకారం రూ.45 వేలు జీతం ఇవ్వాలి. కానీ ఇక్కడ చాలా తక్కువ జీతం ఇస్తున్నారు. అందులో ఇప్పుడు తగ్గించడం దారుణం.మాకు సరిపడ జీతం ఇస్తేనే పని చేస్తాం. గతంలో 30 శాతం జీతం పెంచిపిస్తా అని రంగనాథ్ గారు చెప్పారు. కానీ పెంచడం పక్కన పెట్టి, తగ్గించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రెండు రోజులు, మూడు రోజులు కంటిన్యూగా పని చేస్తున్నాము. జీహెచ్ఎంసీ ఈవీడిఏంలో పని చేసినప్పుడు 8 గంటల డ్యూటీ మాత్రమే ఉండేది. ఇప్పుడు 12 గంటలు, ఆపై సమయం పని చేయిస్తున్నాము. మాకు న్యాయం చేయాలి’ అని మార్షల్స్ కోరారు.
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!