Bhatti Vikramarka: ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత!
- సివిల్స్-2024 విజేతలకు సన్మాన కార్యక్రమం
- సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న భట్టి, కోమటిరెడ్డి
- నిస్సహాయకులకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి
ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి అందించే ఓ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మానవ వనరులు అత్యంత బలమైన పెట్టుబడి అని, మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. గతేడాది అభయ హస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్ అయ్యారని, 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలన్నారు. సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. నిస్సహాయకులకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్-2024 విజేతలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
‘మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఎంతో కొంత సాయం అందించాలని మేం ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం సాయం కాకపోయినా.. కొంత మీకు అండగా ఉండాలని అభయ హస్తం ఇస్తున్నాం. మెయిన్స్కు వెళ్తున్న వారికి లక్ష సాయం చేస్తున్నాం, కొంత కొచించ్కి ఉపయోగ పడుతుందని ప్రభుత్వ ఆలోచన. లాస్ట్ ఇయర్ అభయ హస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్ అయ్యారు. 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలి. సివిల్ సర్వెంట్ల సమావేశాల్లో కొందరు ఐఏఎస్లను రోల్ మోడల్గా చెప్తారు. మాధవరావు, ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్లను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో నిలిచిపోతుంది. ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత. నిస్సహాయకులకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు సక్సెస్ అవుతాయి. మాకు ఎంత చేయాలి అని ఉన్నా.. ఐఏఎస్లలో నిబద్ధత లేకుంటే లక్ష్యం చేరుకోలేం. శంకరన్ లాంటి వాళ్లు సంక్షేమ శాఖల్లో పని చేశారు. మిషన్ లాగ పని చేస్తే.. ప్రజలు కూడా మిషన్ లాగే మర్చిపోతారు. సవాళ్లను అధిగమించి లక్ష్యం సాధించండి’ అని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Also Read: KTR Tweet: దరఖాస్తులు తప్పితే దమ్మిడీ ఇచ్చింది లేదు.. కేటీఆర్ ట్వీట్ వైరల్!
‘స్కిల్ డెవలప్మెంట్ నుంచి.. ఇవాళ సివిల్స్కి వెళ్లే వారి వరకు అందరికీ ప్రభుత్వం సహకారం అందిస్తున్నాం. 55 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణ కి ఇప్పటికే టెండర్లు పిలిచాము. రైతు కొడుకు రైతే అవుతున్నాడు. మేము ఐదేళ్లు.. పదేళ్లు పదవుల్లో ఉంటాం. సివిల్స్ సాధించి మీరు ప్రజల సేవలో ఉండండి. కాన్ఫిడెన్స్తో సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. డిల్లీలో నా క్వార్టర్స్ను చదువుకునే వారికే ఇచ్చా. నా క్వార్టర్స్లో ఉండి చదువుకున్న ఇద్దరు ఇప్పుడు నా జిల్లాలోనే సర్వీసులో ఉన్నారు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో