AV Ranganath : హైడ్రా విధుల్లో డీఆర్ఎఫ్ కీలకం.. కమిషనర్ రంగనాథ్
- హైడ్రా సేవల్లో డీఆర్ఎఫ్ కీలక భూమిక
- ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధ్యతలు
- ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో కొత్త లక్ష్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AV Ranganath : హైడ్రా నిర్వహించే సేవలలో డీఆర్ఎఫ్ (DRF) బృందాల పాత్ర అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలను నెరవేర్చే విధంగా హైడ్రా కార్యకలాపాలు ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
గురువారం డీఆర్ఎఫ్లో ఔట్సోర్సింగ్ విధానంలో కొత్తగా నియమితులైన 357 మంది శిక్షణ ప్రారంభోత్సవంలో కమిషనర్ రంగనాథ్ ప్రసంగించారు. అంబర్పేట పోలీసు శిక్షణ కేంద్రంలో వీరికి ఒక వారంపాటు శిక్షణ అందించనున్నారు. హైడ్రా సమాజంలోనే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
CM Chandrababu: ఢిల్లీలో కొత్త శకం మొదలు కానుంది.. అద్భుతమైన అభివృద్ధి జరగబోతోంది!
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో డీఆర్ఎఫ్ కీలకమైన భూమిక పోషిస్తుందని కమిషనర్ తెలిపారు. ఇప్పుడు హైడ్రా విధులు కూడా ఈ బృందానికి తోడయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం డీఆర్ఎఫ్పై నమ్మకంతోనే కొత్త బాధ్యతలను అప్పగిస్తోందని, తాజాగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే పనిని కూడా అప్పగించినట్లు వెల్లడించారు. ఈ బాధ్యతలను కట్టుదిట్టంగా, నిబద్ధతతో నిర్వహించాల్సిన అవసరముందని హితవిచ్చారు.
పోలీసు పరీక్షలో కొద్దిపాటి మార్కుల తేడాతో ఉద్యోగం పొందలేని వారి మెరిట్ లిస్ట్ ఆధారంగా, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా నియామకాలు జరిగాయని కమిషనర్ వివరించారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగ పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అందరికీ లభించిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.
భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రజలకు అండగా ఉండేందుకు, ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అంబర్పేట పోలీసు శిక్షణ కేంద్రంలో ఈ కొత్తగా నియమితులైన సభ్యులు శిక్షణ పొందుతున్నారని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
Champions Trophy 2025: పాక్ ఓడినప్పటికీ చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!