AV Ranganath : హైడ్రా విధుల్లో డీఆర్ఎఫ్ కీలకం.. కమిషనర్ రంగనాథ్
- హైడ్రా సేవల్లో డీఆర్ఎఫ్ కీలక భూమిక
- ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధ్యతలు
- ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో కొత్త లక్ష్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AV Ranganath : హైడ్రా నిర్వహించే సేవలలో డీఆర్ఎఫ్ (DRF) బృందాల పాత్ర అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలను నెరవేర్చే విధంగా హైడ్రా కార్యకలాపాలు ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
గురువారం డీఆర్ఎఫ్లో ఔట్సోర్సింగ్ విధానంలో కొత్తగా నియమితులైన 357 మంది శిక్షణ ప్రారంభోత్సవంలో కమిషనర్ రంగనాథ్ ప్రసంగించారు. అంబర్పేట పోలీసు శిక్షణ కేంద్రంలో వీరికి ఒక వారంపాటు శిక్షణ అందించనున్నారు. హైడ్రా సమాజంలోనే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
CM Chandrababu: ఢిల్లీలో కొత్త శకం మొదలు కానుంది.. అద్భుతమైన అభివృద్ధి జరగబోతోంది!
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో డీఆర్ఎఫ్ కీలకమైన భూమిక పోషిస్తుందని కమిషనర్ తెలిపారు. ఇప్పుడు హైడ్రా విధులు కూడా ఈ బృందానికి తోడయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం డీఆర్ఎఫ్పై నమ్మకంతోనే కొత్త బాధ్యతలను అప్పగిస్తోందని, తాజాగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే పనిని కూడా అప్పగించినట్లు వెల్లడించారు. ఈ బాధ్యతలను కట్టుదిట్టంగా, నిబద్ధతతో నిర్వహించాల్సిన అవసరముందని హితవిచ్చారు.
పోలీసు పరీక్షలో కొద్దిపాటి మార్కుల తేడాతో ఉద్యోగం పొందలేని వారి మెరిట్ లిస్ట్ ఆధారంగా, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా నియామకాలు జరిగాయని కమిషనర్ వివరించారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగ పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అందరికీ లభించిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.
భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రజలకు అండగా ఉండేందుకు, ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అంబర్పేట పోలీసు శిక్షణ కేంద్రంలో ఈ కొత్తగా నియమితులైన సభ్యులు శిక్షణ పొందుతున్నారని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
Champions Trophy 2025: పాక్ ఓడినప్పటికీ చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం..
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!