హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారని వెల్లడించారు. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుంది.. తమ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నుండి ఇమేజ్ రికార్డులు సేకరించాము.. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా తమ వద్ద ఉందని తెలిపారు. చెరువులు నింపి ఎఫ్టీఎల్ (FTL) పరిధి మార్చినా కూడా.. వాటిని గుర్తించేందుకు పని చేస్తున్నామన్నారు. అలాగే.. శాటిలైట్ ఏజెన్సీలతో కూడా సమావేశం అవుతున్నాం.. సమూహంగా ఇచ్చే ఫిర్యాదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
Congress: మన్మోహన్ సింగ్ మరణంపై బీజేపీ రాజకీయం.. సిద్ధూ విమర్శలు..
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఎలా ఉండేది అనేది గుర్తిస్తున్నామని హైడ్రా కమిషనర్ తెలిపారు. హైడ్రా కేవలం డిమాలేషన్ కోసమే అన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. హైడ్రా చెరువులు పునరుద్ధరణ చేస్తుందని త్వరలోనే నిరూపిస్తామని అన్నారు. మరోవైపు 72 డీఆర్ఎఫ్ టీమ్లు అందుబాటులోకి రాబోతున్నాయి.. చెట్లు పడిపోవడం, నీళ్ళు నిలవడం, ఫైర్ ఆక్సిడెంట్లపై డీఆర్ఎఫ్ పని చేస్తుందన్నారు. త్వరలో తమకు వెదర్ రాడార్ రాబోతుంది.. అంతేకాకుండా హైడ్రా కోసం ఒక FM ఛానెల్ పెట్టాలని ఆలోచన చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. నోటరీ ఉన్న వాటిని కొనెప్పుడు ప్రజలు ఆలోచించాలి.. రెండు మూడు రకాలుగా వెరిఫై చేసి కొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Legally Veer : లీగల్లీ వీర్ ముఖ్య ఉద్దేశం అదే : హీరో వీర్ రెడ్డి
అనుమతి లేని నిర్మాణాల్లో బిజినెస్ చేసేవాళ్ళు.. నోటీస్ ఇచ్చిన వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇళ్ళు, ప్లాట్స్ కొనే వారి కోసం.. బఫర్, FTLలో ఉన్నాయా లేవా చెప్పేందుకు హైడ్రా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 19కు ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదు.. పర్మిషన్ లేకుంటే కూల్చివేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు 200 ఎకరాలు హైడ్రా కాపాడింది.. 2025లో 12 చెరువులు హైడ్రా సుందరీకరించాలని టార్గెట్ పెట్టుకుందని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ల్యాండ్ గ్రబ్బర్స్, ల్యాండ్ మాఫీయా వాళ్లు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు.. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా హైడ్రా వైపు చూస్తున్నారు.. ప్రజలు, చదువుకున్న వాళ్ళు హైడ్రా వైపు వస్తున్నారని అన్నారు. సామాన్యులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదని తేల్చి చెప్పారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడా దెబ్బ తినడం లేదని హైడ్రా కమిషనర్ చెప్పారు.
