Hyderabad Traffic Police : మైనర్ డ్రైవింగ్పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఓ మైనర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మార్నింగ్ వాక్కు వెళ్లిన ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొన్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తల్లిదండ్రులు వారి పిల్లలను పర్యవేక్షిస్తుండాలని, మైనర్లకు వాహనాలను అప్పగించవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పోలీసులు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మాసబ్ ట్యాంక్ నివాసి మహ్మద్ బదరుద్దీన్ క్వాద్రీ (19) అనే యువకుడు మంగళవారం తెల్లవారుజామున తన కారును అతి వేగంతో నార్సింగిలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఇద్దరు మహిళలు అనురాధ (48), ఆమె కుమార్తె మమత (25) ఢీకొట్టడంతో వారు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు కవిత, ఇంతాబ్ ఖాన్లకు గాయాలయ్యాయి.
వ్యాపారవేత్త కొడుకు అయిన క్వాద్రీ తన స్నేహితులతో కలిసి బర్త్డే పార్టీ కోసం ఫామ్హౌస్కి వెళ్తున్నాడు. వారు ఉదయం 5 గంటలకు శాంతినగర్ మాసాబ్ ట్యాంక్ నుండి బయలుదేరి మొయినాబాద్ వెళ్తుండగా సంఘటన జరిగింది. బిబిఎ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న క్వాద్రీని, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినప్పటికీ అతనికి కారును నడపడానికి ఇచ్చిన అతని స్నేహితుడు అబ్దుల్ రెహమాన్ (18)ని సైతం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీవీ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా.. “అజాగ్రత్త, ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ రెండు విలువైన జీవితాలు బలిగొన్నాయి – ఇది హృదయ విదారకంగా ఉంది. మన మంచి కోసం మన పిల్లలను అదుపులో ఉంచుకోవడానికి, వారి కదలికలపై కఠినమైన నిఘా ఉంచడానికి సమయం ఆసన్నమైంది.’ అని ఆయన అన్నారు.
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ .. సరైన పర్యవేక్షణలో తప్ప తమ పిల్లలకు వాహనాలను అప్పగించే ముందు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలన్నారు. ప్రేమ మరియు ఆప్యాయత కారణంగా, తల్లిదండ్రుల వాహనాలను వారి పిల్లలకు అప్పగించడం ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి. మంగళవారం ఇబ్రహీంపట్నం వద్ద ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులపైకి కారు ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు బైక్పై వెళుతుండగా అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నగర, శివారు ప్రాంతాల్లో మైనర్ డ్రైవింగ్లపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ప్రచారం చేపట్టారు. పోలీసు ప్రత్యేక బృందాలు విద్యా సంస్థలతో పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రాచకొండ డీసీపీ ట్రాఫిక్ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న కొద్ది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, మైనర్ల డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై దృష్టి సారిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!