Hyderabad Traffic Police : మైనర్ డ్రైవింగ్పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఓ మైనర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మార్నింగ్ వాక్కు వెళ్లిన ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొన్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తల్లిదండ్రులు వారి పిల్లలను పర్యవేక్షిస్తుండాలని, మైనర్లకు వాహనాలను అప్పగించవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పోలీసులు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మాసబ్ ట్యాంక్ నివాసి మహ్మద్ బదరుద్దీన్ క్వాద్రీ (19) అనే యువకుడు మంగళవారం తెల్లవారుజామున తన కారును అతి వేగంతో నార్సింగిలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఇద్దరు మహిళలు అనురాధ (48), ఆమె కుమార్తె మమత (25) ఢీకొట్టడంతో వారు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు కవిత, ఇంతాబ్ ఖాన్లకు గాయాలయ్యాయి.
వ్యాపారవేత్త కొడుకు అయిన క్వాద్రీ తన స్నేహితులతో కలిసి బర్త్డే పార్టీ కోసం ఫామ్హౌస్కి వెళ్తున్నాడు. వారు ఉదయం 5 గంటలకు శాంతినగర్ మాసాబ్ ట్యాంక్ నుండి బయలుదేరి మొయినాబాద్ వెళ్తుండగా సంఘటన జరిగింది. బిబిఎ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న క్వాద్రీని, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినప్పటికీ అతనికి కారును నడపడానికి ఇచ్చిన అతని స్నేహితుడు అబ్దుల్ రెహమాన్ (18)ని సైతం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీవీ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా.. “అజాగ్రత్త, ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ రెండు విలువైన జీవితాలు బలిగొన్నాయి – ఇది హృదయ విదారకంగా ఉంది. మన మంచి కోసం మన పిల్లలను అదుపులో ఉంచుకోవడానికి, వారి కదలికలపై కఠినమైన నిఘా ఉంచడానికి సమయం ఆసన్నమైంది.’ అని ఆయన అన్నారు.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ .. సరైన పర్యవేక్షణలో తప్ప తమ పిల్లలకు వాహనాలను అప్పగించే ముందు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలన్నారు. ప్రేమ మరియు ఆప్యాయత కారణంగా, తల్లిదండ్రుల వాహనాలను వారి పిల్లలకు అప్పగించడం ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి. మంగళవారం ఇబ్రహీంపట్నం వద్ద ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులపైకి కారు ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు బైక్పై వెళుతుండగా అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నగర, శివారు ప్రాంతాల్లో మైనర్ డ్రైవింగ్లపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ప్రచారం చేపట్టారు. పోలీసు ప్రత్యేక బృందాలు విద్యా సంస్థలతో పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రాచకొండ డీసీపీ ట్రాఫిక్ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న కొద్ది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, మైనర్ల డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై దృష్టి సారిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!