Hyderabad Metro: ఆర్టీసీ కార్మికుల సమ్మే వేళ.. ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పిన మెట్రో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: ఆర్టీసీ కార్మికుల సమ్మే వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. టీజీఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో సేవలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హెచ్ఎంఆర్ఎల్ మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచింది. రోజంతా గరిష్టంగా 56 మెట్రో రైళ్లు నడపాలని నిర్ణయించింది. రద్దీ సమయాల్లో ప్రతి 3 నిమిషాలు 40 సెకన్లకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. నాన్పీక్ అవర్స్లో రైళ్ల సంఖ్యకు 44 రైళ్లు తగ్గించారు. మియాపూర్–ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలు 20 సెకన్లకు ఒక రైలు అందుబాటులో ఉండనుంది. నాగోల్–రాయదుర్గ్ మార్గంలో 3 నిమిషాలు 40 సెకన్లకు మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది. సమ్మెతో ఇబ్బందులు తగ్గించేందుకు మెట్రో కీలక చర్యలు తీసుకుంది. రాత్రి మెట్రో సేవల పొడిగింపుపై పరిశీలన చేయనుంది. చివరి మెట్రో రైలు సమయం 11 తర్వాత కూడా ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా మెట్రో సేవల విస్తరణ చేశారు.
READ MORE: Delhi: ఢిల్లీలో దారుణం.. యూపీఎస్సీకి సిద్ధపడుతున్న యువతి హత్యాచారం
Also Read
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. తాజాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఎన్టీవీతో మాట్లాడారు. ఆర్టీసీలో ఉన్న సమస్యలు కొత్తవి కావని.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. మొండి పట్టుదలతో కార్మిక సంఘాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. ఆర్టీసీనీ ప్రజల నుంచి దూరం చేయకండి.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పరిస్థితి మెరుగు అవుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు. సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 25% బస్సులు నడుస్తున్నాయని..ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ఇల్లీగల్గా చేస్తున్నారని.. ఇది లేబర్ కమిషన్ చెబుతోందన్నారు. ఒక నెలలో ప్రస్తుతం 700 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందని.. ఇలా సంఘాలు కావాలని సమ్మె లోకి వెళితే నష్టాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.. కాబట్టి సమ్మె విరమించండి.. చర్చలకు రండి… RTC నీ కాపాడండి అని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?