Hyderabad Mayor: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదు..
- గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదు
- గణేష్ నిమజ్జనానికి చెరువుల సంసిద్ధతను పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి
- నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Mayor Vijayalakshmi: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదని, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఎల్బీ నగర్ జోన్లో పర్యటించి గణేష్ నిమజ్జనానికి చెరువులు, బేబీ పాండ్స్ సంసిద్ధత, ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్బీ నగర్ జోన్లో కాప్రా చెరువు, చెర్లపల్లి చెరువు, డాక్టర్ ఏఎస్ రావు నగర్ పాండ్ను, నాగోల్ చెరువు, బేబీ పాండ్, మన్సురాబాద్ పెద్ద చెరువు బేబీ పాండ్, సరూర్ నగర్ ట్యాంక్ బండ్ను పరిశీలించి నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Read Also: IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు..
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
- Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
- Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిమజ్జన ఏర్పాట్లలో అలసత్వం వహించవద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మొబైల్ టాయిలెట్, స్టాటిస్టిక్, మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్విమ్మర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
నిమజ్జనంకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎల్బీనగర్, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, శానిటేషన్, లేక్స్, ఇంజనీరింగ్, పోలీస్, ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఎంటమాలజీ,తదితర విభాగాల అధికారులు, కార్పొరేటర్లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
-
Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?