Hyderabad Mayor: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదు..
- గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదు
- గణేష్ నిమజ్జనానికి చెరువుల సంసిద్ధతను పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి
- నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Mayor Vijayalakshmi: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదని, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఎల్బీ నగర్ జోన్లో పర్యటించి గణేష్ నిమజ్జనానికి చెరువులు, బేబీ పాండ్స్ సంసిద్ధత, ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్బీ నగర్ జోన్లో కాప్రా చెరువు, చెర్లపల్లి చెరువు, డాక్టర్ ఏఎస్ రావు నగర్ పాండ్ను, నాగోల్ చెరువు, బేబీ పాండ్, మన్సురాబాద్ పెద్ద చెరువు బేబీ పాండ్, సరూర్ నగర్ ట్యాంక్ బండ్ను పరిశీలించి నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Read Also: IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు..
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిమజ్జన ఏర్పాట్లలో అలసత్వం వహించవద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మొబైల్ టాయిలెట్, స్టాటిస్టిక్, మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్విమ్మర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
నిమజ్జనంకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎల్బీనగర్, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, శానిటేషన్, లేక్స్, ఇంజనీరింగ్, పోలీస్, ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఎంటమాలజీ,తదితర విభాగాల అధికారులు, కార్పొరేటర్లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!