Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fish Medicine: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం సోమవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయగా.. వేలాది మంది ప్రజలు ప్రసాదం కోసం తరలివచ్చారు.
చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ మొత్తం 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. ఇందులో లక్షా 40 వేల కొరమీను చేప పిల్లలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మరిన్ని చేప పిల్లలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 50 వేల మందికి పైగా చేప ప్రసాదం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి రోగులు రెండు రోజుల ముందుగానే హైదరాబాద్కు చేరుకున్నారు. ఈసారి సుమారు 3 లక్షల మందికి పైగా ప్రసాదం తీసుకునేందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో ప్రజలు ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. చిన్న సజీవ చేప నోటిలో ప్రత్యేక ఆయుర్వేద మందును ఉంచి రోగులు మింగే విధంగా ప్రసాదాన్ని అందజేస్తారు. చేపలు తినలేని శాకాహారులకు అదే మందును బెల్లంతో కలిపి అందిస్తున్నారు. ప్రసాదం కోసం వచ్చిన ప్రజలకు ప్రభుత్వం విస్తృత సౌకర్యాలు కల్పించింది. వృద్ధులు, వికలాంగులు, వీఐపీల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల ద్వారా ప్రజలను క్రమబద్ధంగా పంపించి, వాలంటీర్ల సహాయంతో ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ చేప ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.
తాజావార్తలు
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!