Crime : భార్యను హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టిన భర్త
- మహబూబ్నగర్ జిల్లాలో భయానక ఘటన
- భార్యను హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో పూడ్చిన భర్త
- దుర్వాసన వ్యాపించడంతో విషయం వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime : మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో సోమవారం భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యను హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం, మారేపల్లి నారమ్మ (45) మరియు వెంకటయ్య దంపతులు. నారమ్మ ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేస్తుండగా, వెంకటయ్య గొర్రెల కాపరిగా పనిచేసేవాడు.
Pushpa 2: ఓవర్సీస్ లో మరో మైలురాయి చేరుకున్న’పుష్ప -2′
ఈ నెల 17న నారమ్మ కనిపించకపోవడంతో ఆమె భర్త వెంకటయ్య తన కుమారుడు భరత్కు సమాచారం అందించాడు. భరత్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 21న భరత్ తన తండ్రితో కలిసి భూత్పూర్ పోలీసులకు మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశాడు. ఎస్సై చంద్రశేఖర్ ఈ కేసును నమోదు చేసి నారమ్మ ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించారు.
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
సోమవారం ఉదయం గ్రామ పరిసర ప్రాంతంలో దుర్వాసన వ్యాపించడంతో గ్రామస్తులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే.. సెప్టిక్ ట్యాంక్లోని చెత్తను పరిశీలించగా, నారమ్మ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. నారమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!