Delhi: అక్రమ సంబంధమని అనుమానం.. భార్యని, పక్కింటి వ్యక్తిని చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో హత్యలు ఆగేలా కనిపించడం లేదు. ఢిల్లీలో ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి. ఇటీవలే అక్కడ జంట హత్యలు కలకలం రేపుతుండగా తాజాగా మరో జంట హత్యల కలకలం రేగింది. తన భార్య పక్కింటి వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఇద్దరినీ దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. హత్యలకు పాల్పడిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. భర్త పేరు ఇమ్రాన్. ఈ ఘటనతో ఢిల్లీలో కలకలం రేగింది.
Read Also:Dharmana Prasada Rao: ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదు..
Also Read
- Wayanad: వయనాడ్లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
- ICC Rankings: వరల్డ్ కప్ కొట్టింది ఆసీస్.. కానీ ర్యాంకింగ్స్ టాప్లో మెరిసింది ఇండియన్ ప్లేయర్..
- Modi-Indonesia: భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు.. తీరనున్న జలసంధి కష్టాలు
- Anirudh vs Sai Abhayankar: అనిరుద్ vs అభయంకర్.. ఇదెక్కడి పోటీ మావా?
తమ ఇంటి పక్కనే నివసిస్తున్న సంజీత్తో తన భార్య కుష్బు అనైతిక సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. దీంతో తరచూ ఈ విషయమై ఆమెతో గొడవ పెట్టుకునేవాడు. వివాదం కాస్త ముదిరి భార్యను, తన పొరుగింటి వ్యక్తిని హతమార్చాడు. తొలుత సంజీత్పై.. ఇమ్రాన్ కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే సంజీత్ కుటుంబీకులు అతన్ని బీఎస్ఏ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. తర్వాత తన సొంత భార్యను కూడా గొంతు కోసి చంపాడు.
Read Also:Virat Kohli Record: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. టాప్ 5 లిస్టులోకి!
హత్య అనంతరం నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను హత్య చేశానని చెప్పడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. పోలీసులు వెంటనే ఆమెను బీఎస్ఏ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. అనంతరం పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతులిద్దరి మధ్య నిజంగానే అనైతిక సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మృతుల ఇరువురి కుటుంబీకులను కలిచివేసింది.
తాజావార్తలు
-
Jayam Ravi: “నన్ను క్షమించండి.. ఇకపై మోసం చేయను”.. భావోద్వేగానికి గురైన స్టార్ హీరో!
-
Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
-
Wayanad: వయనాడ్లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
-
Pakistan: భారత్పై పగతో పెంచిన పామే ఇప్పుడు పాకిస్థాన్ను మింగేస్తుంది! వారంలోనే 50 మంది పాక్ సైనికులు ఖతం..
-
God of War: అసలు కుమారస్వామి ఎక్కడ పుట్టాడు?
ట్రెండింగ్
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!