NTV Telugu Site icon

Suicide: భార్య రొయ్యల కూర వండలేదని భర్త ఆత్మహత్య

Suicide

Suicide

Suicide: దంపతులు అన్నాక కలహాలు, గొడవలు జరగడం సహజం. ఏ కాపురంలోనైనా చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. కలహాలు లేని కాపురాలు ఉండవని అంటారు. ఓ 10 నిమిషాలు కూర్చుంటే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరకుతుంది. ఈ విషయాలను మరిచిపోతున్న కొందరు.. ఇటీవల కాలంలో చాలా సిల్లీ రీజన్స్‌కు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత చిన్న విషయాలకు కూడా చనిపోతారా..? అనే విధంగా ఎంతో విలువైన ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు ఇవాళ ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. పనికిరాని అంశాల కోసం నిండు జీవితాన్ని ముగిస్తున్నారు. తాజాగా.. భార్య రొయ్యల కూర వండలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య రొయ్యలు కూర వండలేదని గొడవ పడి బుచ్చిరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న విషయానికే ప్రాణాలు తీసుకున్నాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.

 

Read Also: MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం