Delhi Incident: ఢిల్లీలో దారుణం.. 16 ఏళ్ల బాలికను 21 సార్లు కత్తితో పొడిచి హత్య..
Delhi Incident: ఢిల్లీలో దారుణ సంఘటన జరిగింది. 16 ఏళ్ల బాలికపై బాయ్ ఫ్రెండ్ దారుణంగా దాడి చేసి చంపేశాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న ఈ ఘటన నిన్న ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ఏరియాలోని రోహిణిలో జరిగింది. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బాలికపై కత్తితో 21 సార్లు పొడిచాడు. కత్తి తలలో ఇరుక్కుపోయినా ఆగకుండా బండరాయితో మోదీ దాడి చేశారు. అటుగా వెళ్తున్న జనాలు చూసినా కూడా ఈ దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆమెను ఐదుసార్లు బండరాయితో కొట్టాడు. 20 ఏళ్ల సాహిల్ ను నిందితుడిగా గుర్తించారు. వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి ఒక రోజు ముందు ఇద్దరూ గొడవ పడినట్లు సమాచారం.
Read Also: Viral: బీభత్సం సృష్టిస్తున్న ఈదరగాలులు.. కుప్పకూలిన సెల్ టవర్
Also Read
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
చనిపోయిన బాధితురాలని నిక్కీగా గుర్తించారు. నిక్కీ ఫోన్ నుంచి చాట్ హిస్టరీని నిందితుడు తొలిగించాడు. నిక్కీ తన స్నేహితుడి కుమారుడి పుట్టిన రోజుకు వెళ్తుండగా.. సాహిల్ ఆమెను ఆపేసి పలుమార్లు కత్తితో పొడిచాడు. ప్రస్తుతం సాహిల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించినట్లు త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ టీములు రంగంలోకి దిగాయి.
ఈ హత్యపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. లెఫ్టినెంట్ గర్నవర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ఢిల్లీలో ఓ మైనర్ బాలికను బహిరంగంగా దారుణంగా హత్య చేశారు. ఇది చాలా విచారకరం మరియు దురదృష్టకరం. నేరస్తులు నిర్భయగా మారారు. పోలీసులంటే భయం లేదు. L-G సార్, లా అండ్ ఆర్డర్ మీ బాధ్యత. ఏదో ఒకటి చేయి. ఢిల్లీ ప్రజల భద్రత చాలా ముఖ్యమైనది’’ అని అన్నారు. ఢిల్లీలో మహిళలకు భద్రత లేదని ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాలి మలివాల్ అన్నారు. షహబాద్ లోని బాధితురాలి ఇంటి ఆవరణలోనే దారుణంగా హత్యకు గురైందని అన్నారు. ఆమె మాట్లాడుతూ, “16 ఏళ్ల అమ్మాయిని 40-50 సార్లు కత్తితో పొడిచారు, ఆపై చాలాసార్లు రాయితో కొట్టారు, ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది. చాలా మంది దీనిని చూసినా పట్టించుకోలేదు. ఢిల్లీలో మహిళలు, బాలికలకు భద్రత లేకుండా పోయింది. కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ ఎల్జీ, డీసీడబ్ల్యూ చీఫ్ మరియు ఢిల్లీ సీఎంతో ఉన్నత స్థాయి సమావేశాన్ని పిలవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!