Delhi Incident: ఢిల్లీలో దారుణం.. 16 ఏళ్ల బాలికను 21 సార్లు కత్తితో పొడిచి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Incident: ఢిల్లీలో దారుణ సంఘటన జరిగింది. 16 ఏళ్ల బాలికపై బాయ్ ఫ్రెండ్ దారుణంగా దాడి చేసి చంపేశాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న ఈ ఘటన నిన్న ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ఏరియాలోని రోహిణిలో జరిగింది. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బాలికపై కత్తితో 21 సార్లు పొడిచాడు. కత్తి తలలో ఇరుక్కుపోయినా ఆగకుండా బండరాయితో మోదీ దాడి చేశారు. అటుగా వెళ్తున్న జనాలు చూసినా కూడా ఈ దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆమెను ఐదుసార్లు బండరాయితో కొట్టాడు. 20 ఏళ్ల సాహిల్ ను నిందితుడిగా గుర్తించారు. వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి ఒక రోజు ముందు ఇద్దరూ గొడవ పడినట్లు సమాచారం.
Read Also: Viral: బీభత్సం సృష్టిస్తున్న ఈదరగాలులు.. కుప్పకూలిన సెల్ టవర్
Also Read
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
చనిపోయిన బాధితురాలని నిక్కీగా గుర్తించారు. నిక్కీ ఫోన్ నుంచి చాట్ హిస్టరీని నిందితుడు తొలిగించాడు. నిక్కీ తన స్నేహితుడి కుమారుడి పుట్టిన రోజుకు వెళ్తుండగా.. సాహిల్ ఆమెను ఆపేసి పలుమార్లు కత్తితో పొడిచాడు. ప్రస్తుతం సాహిల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించినట్లు త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ టీములు రంగంలోకి దిగాయి.
ఈ హత్యపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. లెఫ్టినెంట్ గర్నవర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ఢిల్లీలో ఓ మైనర్ బాలికను బహిరంగంగా దారుణంగా హత్య చేశారు. ఇది చాలా విచారకరం మరియు దురదృష్టకరం. నేరస్తులు నిర్భయగా మారారు. పోలీసులంటే భయం లేదు. L-G సార్, లా అండ్ ఆర్డర్ మీ బాధ్యత. ఏదో ఒకటి చేయి. ఢిల్లీ ప్రజల భద్రత చాలా ముఖ్యమైనది’’ అని అన్నారు. ఢిల్లీలో మహిళలకు భద్రత లేదని ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాలి మలివాల్ అన్నారు. షహబాద్ లోని బాధితురాలి ఇంటి ఆవరణలోనే దారుణంగా హత్యకు గురైందని అన్నారు. ఆమె మాట్లాడుతూ, “16 ఏళ్ల అమ్మాయిని 40-50 సార్లు కత్తితో పొడిచారు, ఆపై చాలాసార్లు రాయితో కొట్టారు, ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది. చాలా మంది దీనిని చూసినా పట్టించుకోలేదు. ఢిల్లీలో మహిళలు, బాలికలకు భద్రత లేకుండా పోయింది. కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ ఎల్జీ, డీసీడబ్ల్యూ చీఫ్ మరియు ఢిల్లీ సీఎంతో ఉన్నత స్థాయి సమావేశాన్ని పిలవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!