Delhi Incident: ఢిల్లీలో దారుణం.. 16 ఏళ్ల బాలికను 21 సార్లు కత్తితో పొడిచి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Incident: ఢిల్లీలో దారుణ సంఘటన జరిగింది. 16 ఏళ్ల బాలికపై బాయ్ ఫ్రెండ్ దారుణంగా దాడి చేసి చంపేశాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న ఈ ఘటన నిన్న ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ఏరియాలోని రోహిణిలో జరిగింది. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బాలికపై కత్తితో 21 సార్లు పొడిచాడు. కత్తి తలలో ఇరుక్కుపోయినా ఆగకుండా బండరాయితో మోదీ దాడి చేశారు. అటుగా వెళ్తున్న జనాలు చూసినా కూడా ఈ దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆమెను ఐదుసార్లు బండరాయితో కొట్టాడు. 20 ఏళ్ల సాహిల్ ను నిందితుడిగా గుర్తించారు. వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి ఒక రోజు ముందు ఇద్దరూ గొడవ పడినట్లు సమాచారం.
Read Also: Viral: బీభత్సం సృష్టిస్తున్న ఈదరగాలులు.. కుప్పకూలిన సెల్ టవర్
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
చనిపోయిన బాధితురాలని నిక్కీగా గుర్తించారు. నిక్కీ ఫోన్ నుంచి చాట్ హిస్టరీని నిందితుడు తొలిగించాడు. నిక్కీ తన స్నేహితుడి కుమారుడి పుట్టిన రోజుకు వెళ్తుండగా.. సాహిల్ ఆమెను ఆపేసి పలుమార్లు కత్తితో పొడిచాడు. ప్రస్తుతం సాహిల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించినట్లు త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ టీములు రంగంలోకి దిగాయి.
ఈ హత్యపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. లెఫ్టినెంట్ గర్నవర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ఢిల్లీలో ఓ మైనర్ బాలికను బహిరంగంగా దారుణంగా హత్య చేశారు. ఇది చాలా విచారకరం మరియు దురదృష్టకరం. నేరస్తులు నిర్భయగా మారారు. పోలీసులంటే భయం లేదు. L-G సార్, లా అండ్ ఆర్డర్ మీ బాధ్యత. ఏదో ఒకటి చేయి. ఢిల్లీ ప్రజల భద్రత చాలా ముఖ్యమైనది’’ అని అన్నారు. ఢిల్లీలో మహిళలకు భద్రత లేదని ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాలి మలివాల్ అన్నారు. షహబాద్ లోని బాధితురాలి ఇంటి ఆవరణలోనే దారుణంగా హత్యకు గురైందని అన్నారు. ఆమె మాట్లాడుతూ, “16 ఏళ్ల అమ్మాయిని 40-50 సార్లు కత్తితో పొడిచారు, ఆపై చాలాసార్లు రాయితో కొట్టారు, ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది. చాలా మంది దీనిని చూసినా పట్టించుకోలేదు. ఢిల్లీలో మహిళలు, బాలికలకు భద్రత లేకుండా పోయింది. కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ ఎల్జీ, డీసీడబ్ల్యూ చీఫ్ మరియు ఢిల్లీ సీఎంతో ఉన్నత స్థాయి సమావేశాన్ని పిలవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!