Twitter : ఎలాన్ మస్క్కు ఉద్యోగుల షాక్.. ట్విట్టర్కు వందలాది మంది గుడ్ బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter : కొంతకాలంగా ట్విటర్ సంస్థలో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్న భయాందోళనలో నెట్టుకొస్తున్నారు. ఇదంతా ఎందుకు.. ఇక ఏదైతే అదైందని మూకుమ్మడి రాజీనామాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ చిక్కిన తర్వాత సంస్థలో సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తామన్న ప్రకటన యూజర్లను అయోమయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ ఉద్యోగులు కొందరు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సంస్థకు గుడ్బై చెప్పాలని వందలాదిమంది నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువ గంటలు పనిచేయాలని, లేదంటే సంస్థను వదిలివెళ్లాలంటూ మస్క్ అల్టిమేటం నేపథ్యంలోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read Also: Alien Birth: బీహార్లో వింత శిశువు జననం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
Also Read
- టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
- Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
- 7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
- Women Financial Assistance: మహిళలకు గుడ్ న్యూస్.. ఇక, నెలకు రూ.2,500.. అర్హతలు ఇవే..
ఇటీవల వర్క్ ప్లేస్ యాప్ ‘బ్లైండ్’ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 180 మంది ఉద్యోగులను ప్రశ్నించగా 42 శాతం మంది సంస్థను వదిలివెళ్లేందుకే మొగ్గు చూపారు. పావువంతు మంది మాత్రం అయిష్టంగానే కొనసాగేందుకు ఇష్టపడగా 7 శాతం మంది సంస్థను అంటిపెట్టుకుని ఉండేందుకు ఓటు వేశారు. సంస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరిని కలిసిన మస్క్ వారిని సంస్థలో ఉండమని ఒప్పించేందుకు ప్రయత్నించినట్టు మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. కంపెనీని అంటిపెట్టుకుని ఉండేది ఎందరన్న విషయంలో స్పష్టత లేదు.. తొందరపడి ఉద్యోగులను తొలగించాలనుకోవడం, ఎక్కువ పనిగంటలు పనిచేసేలా ఒత్తిడి తీసుకురావడం వంటి కారణాలతో కంపెనీలో కొనసాగేందుకు ఎక్కుమంది సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. ఉద్యోగులు పెద్దమొత్తంలో రాజీనామాలు చేసి కంపెనీని వీడాలనుకుంటున్నట్టు వార్తలు రావడంతో సోమవారం వరకు ఆఫీసులను మూసి బ్యాడ్జ్ యాక్సెస్ తగ్గించనున్నట్టు కంపెనీ నుంచి ఉద్యోగులకు సమాచారం అందింనట్లు తెలిసింది.
తాజావార్తలు
-
AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
-
Lenin: థియేటర్లకు ముందే ‘లెనిన్’ జాక్పాట్.. నాన్ థియేట్రికల్ రైట్స్తో రూ.34 కోట్ల వసూళ్లు!
-
IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
ట్రెండింగ్
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!