Bangladesh MP Murder Case: బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక మలుపు.. మానవ ఎముకలు స్వాధీనం..
Bangladesh MP Murder Case: గత నెలలో బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యం కోసం కోల్కతా వచ్చిన ఆయనను దారుణంగా హత్య చేశారు. ఇప్పటికే ఆయన బాడీని రికవరీ చేయడం దర్యాప్తు అధికారులకు కష్టంగా మారింది. అంత పకడ్బందీగా ఈ హత్యకు పాల్పడ్డారు. మే 12న కోల్కతాకు వచ్చిన అన్వరుల్, ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు. బెంగాల్ సీఐడీ ప్రకారం, జిహాద్ హవ్లాదార్, సియామ్ హుస్సేన్ అనే ఇద్దరు బంగ్లాదేశీ పౌరులు ఎంపీని హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు ఎంపీ స్నేహితుడు రూ.5 కోట్ల సుపారీ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే బెంగాల్లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని కాలువలో మానవుడిదిగా భావిస్తున్న ఎముకనలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఇటీవళ అరెస్టైన 33 ఏళ్ల నిందితుడు సియామ్ హుస్సేన్ని విచారించిన తర్వాత ఈ రికవరీ సాధ్యమైంది. ఈ కేసులో తొలుత జిహాద్ హవ్లాదార్ అనే బంగ్లాదేశ్కి చెందిన నిందితుడి అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు రెండో వ్యక్తి హుస్సేన్ని అరెస్ట్ చేశారు.
Also Read
- West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read Also: Modi’s swearing-in: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరుకానున్నారు
బంగ్లాదేశ్ ఎంపీ శరీరభాగాలను పారేసిన ఖచ్చితమైన స్థలాన్ని సియామ్ హుస్సేన్ సీఐడీకి వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా సీఐడీ దక్షిణ 24 పరగణాస్లోని భాంగర్ ప్రాంతంలోని ఉత్తర కాశీపూర్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మానవుడికి సంబంధించిన అనేక ఎములకును అధికారులు కనుగొన్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.
కోల్కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో ఫ్లాట్ బంగ్లా ఎంపీ చివరిసారిగా కనిపించారు. ఈ ఫ్లాట్లోనే అతడిని హత్య చేసి, చర్మ ఒలిచి, ఎముకలను శరీర భాగాలను వేరు చేసి వేరు వేరు చోట్ల పారేశారు. అన్వరుల్ అజీమ్ అనార్కు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ మే 18న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎంపీ మిస్సింగ్ గురించి తెలిపింది. మే 12న బిశ్వాస్ ఇంటికి వచ్చిన ఎంపీ, మే 13న మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వెళ్లి తిరిగి రాలేదు. హత్య చేసిన జిహాద్ హవ్లాదార్ కసాయి వృత్తిలో ఉన్నాడు. ఇతను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి ముంబైలో నివసిస్తున్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో