NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala

Tirumala

Tirumala: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా.. నిన్న(ఆదివారం) శ్రీవారిని 81,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,833 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. టైమ్‌స్లాట్ ఎస్‌ఎస్‌డీ దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Read Also: Amaravati: అమరావతికి పూర్వ వైభవం..సంతోషంలో రైతులు

ఇదిలా ఉండగా.. తిరుమలలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. 19 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక జ్యేష్టాభిషేకం ఉత్సవాలు నిర్వహించనున్నారు. 22వ తేదీన పౌర్ణమి గరుడ వాహన సేవ జరగనుంది. ఆ రోజు రాత్రి 7గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు.