Kerala Cunning Man : స్వీట్లు పంచాడు.. 100మందికి దావత్ అన్నాడు.. బిల్లు కట్టకుండా ఉడాయించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Cunning Man : టిప్ టాప్ గా 5స్టార్ హోటల్ కి రాగానే వెల్ కం చెప్పారు.. వేషం చూసి ఆయనేదో ఆఫీసర్ అనుకున్నారు. ఆనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అబ్బో అని ఆశ్చర్యపోయారు. తియ్యగా మాట్లాడుతుంటే టిప్పు గ్యారెంటీ అనుకున్నారు. అడ్వాన్స్ తీసుకోకుండానే ఆశ్రయం ఇచ్చారు. స్వీట్లు పంచుతుంటే మనసు ఎంత మంచిదని కీర్తించారు. హోటల్ వదిలి వెళ్లే ముందు 100మందికి దావత్ అంటే అయ్యా నువ్వు మామూలోడివి కాదనుకున్నారు. ఆఖరుకు బిల్లు కట్టకుండా.. ల్యాప్ ట్యాప్ తో ఉడాయించడంతో ఆ హోటల్ సిబ్బంది ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
Read Also: Mother Dairy Hikes Milk Price : పాల ధరను భారీగా పెంచిన మదర్ డైరీ.. ఏడాదిలో ఇది ఐదోసారి
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ వ్యక్తి హోటల్ బిల్లు చెల్లించకుండా ఉడాయించాడు. హోటళ్లలో బస చేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోతున్న 65 ఏళ్ల విన్సెంట్ జాన్ను ఆదివారం కొల్లాం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకుని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. విన్సెంట్ జాన్ పై తిరువనంతపురంలోని ఓ హోటల్ బిల్లు చెల్లించలేదని ఫిర్యాదు చేసింది. జాన్ తమిళనాడులోని తూత్తుకుడి వాసిగా తెలిపారు. కొల్లాంలోని ఓ దుకాణంలో ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. తిరువనంతపురం పోలీసులు అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయడం ద్వారా జాన్ను పట్టుకున్నారు.
Read Also: CBI Arrested Videocon CEO: వీడియోకాన్ గ్రూప్ సీఈవోను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
హోటల్లోని సీసీటీవీలో రికార్డయిన ఛాయాచిత్రాల ఆధారంగా అతడిని గుర్తించారు. జాన్ అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడాడు. అతడి మంచి ప్రవర్తన చూసి రూం అడ్వాన్స్ కూడా తీసుకోలేదని హోటల్ సిబ్బంది తెలిపారు. అతను హోటల్ సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టి.. అతను వెళ్ళి మళ్లీ వస్తా 100మందికి దావత్ ఇస్తాననడంతో సిబ్బంది నమ్మారని పోలీసులు చెప్పారు. ఎప్పటికీ రాకపోవడంతో పోలీసులు అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నారు. జాన్ కేరళలోనే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గోవాలలో గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!