Supreme Court: మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరం ఎలా అవుతుంది? సుప్రీం ప్రశ్న
- మసీదులో జై శ్రీరామ్ నినాదాలు
- సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
- మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా?
- పిటిషనర్ తరఫు లాయర్కి సుప్రీం ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. దీంతో పాటు మసీదులో నినాదాలు చేసిన నిందితులను ఎలా గుర్తించారని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సందీప్ మెహతా డివిజన్ బెంచ్ నిందితుల గుర్తింపును నిర్ధారించే ముందు సీసీటీవీ ఫుటేజీ లేదా మరేదైనా సాక్ష్యాలను పరిశీలించారా? అని కూడా ప్రశ్నించింది.
READ MORE: Group-2 Exam: పురుటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్ష రాసిన అభ్యర్థి
Also Read
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
మసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన నేరం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ ప్రశ్నలను అప్పీలుదారు తరఫు న్యాయవాదిని అడిగిన సుప్రీంకోర్టు ఫిర్యాదు కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పీలు దాఖలు చేయలేదు.
READ MORE:IND vs AUS: బ్యాటింగ్లో కోహ్లీ విఫలం.. రిటైర్ అయి లండన్లో నివసించు అంటూ ట్రోల్స్
వాస్తవానికి.. దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు గత ఏడాది మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ మసీదులోకి ప్రవేశించి జై శ్రీరామ్ నినాదాలు చేశారని, అక్కడున్న వారిని బెదిరించారని ఆరోపించారు. నిందితులిద్దరూ ముస్లింలను శాంతియుతంగా బతకనివ్వమని బెదిరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఇరువురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 295A (మతపరమైన భావాలను దౌర్జన్యం చేసే ఉద్దేశ్యంతో చేసిన చర్యలు), 447 (అతిక్రమం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.
READ MORE:Farmer Won The Lottery: రైతుకు రూ.287 కోట్ల లాటరీ.. అంతలోపే ఊహించని ప్రమాదం..
కాగా.. ఇద్దరు యువకులు తమపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది సెప్టెంబరు 13న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది. నిందితులిద్దరికీ రిలీఫ్ ఇస్తూ..ఈ నినాదాలు చేయడం ద్వారా ప్రజా జీవితంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపవని హైకోర్టు పేర్కొంది. దీంతో ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!