Supreme Court: మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరం ఎలా అవుతుంది? సుప్రీం ప్రశ్న
- మసీదులో జై శ్రీరామ్ నినాదాలు
- సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
- మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా?
- పిటిషనర్ తరఫు లాయర్కి సుప్రీం ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. దీంతో పాటు మసీదులో నినాదాలు చేసిన నిందితులను ఎలా గుర్తించారని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సందీప్ మెహతా డివిజన్ బెంచ్ నిందితుల గుర్తింపును నిర్ధారించే ముందు సీసీటీవీ ఫుటేజీ లేదా మరేదైనా సాక్ష్యాలను పరిశీలించారా? అని కూడా ప్రశ్నించింది.
READ MORE: Group-2 Exam: పురుటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్ష రాసిన అభ్యర్థి
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
మసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన నేరం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ ప్రశ్నలను అప్పీలుదారు తరఫు న్యాయవాదిని అడిగిన సుప్రీంకోర్టు ఫిర్యాదు కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పీలు దాఖలు చేయలేదు.
READ MORE:IND vs AUS: బ్యాటింగ్లో కోహ్లీ విఫలం.. రిటైర్ అయి లండన్లో నివసించు అంటూ ట్రోల్స్
వాస్తవానికి.. దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు గత ఏడాది మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ మసీదులోకి ప్రవేశించి జై శ్రీరామ్ నినాదాలు చేశారని, అక్కడున్న వారిని బెదిరించారని ఆరోపించారు. నిందితులిద్దరూ ముస్లింలను శాంతియుతంగా బతకనివ్వమని బెదిరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఇరువురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 295A (మతపరమైన భావాలను దౌర్జన్యం చేసే ఉద్దేశ్యంతో చేసిన చర్యలు), 447 (అతిక్రమం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.
READ MORE:Farmer Won The Lottery: రైతుకు రూ.287 కోట్ల లాటరీ.. అంతలోపే ఊహించని ప్రమాదం..
కాగా.. ఇద్దరు యువకులు తమపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది సెప్టెంబరు 13న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది. నిందితులిద్దరికీ రిలీఫ్ ఇస్తూ..ఈ నినాదాలు చేయడం ద్వారా ప్రజా జీవితంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపవని హైకోర్టు పేర్కొంది. దీంతో ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!