Supreme Court: మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరం ఎలా అవుతుంది? సుప్రీం ప్రశ్న
- మసీదులో జై శ్రీరామ్ నినాదాలు
- సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
- మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా?
- పిటిషనర్ తరఫు లాయర్కి సుప్రీం ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. దీంతో పాటు మసీదులో నినాదాలు చేసిన నిందితులను ఎలా గుర్తించారని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సందీప్ మెహతా డివిజన్ బెంచ్ నిందితుల గుర్తింపును నిర్ధారించే ముందు సీసీటీవీ ఫుటేజీ లేదా మరేదైనా సాక్ష్యాలను పరిశీలించారా? అని కూడా ప్రశ్నించింది.
READ MORE: Group-2 Exam: పురుటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్ష రాసిన అభ్యర్థి
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
మసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన నేరం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ ప్రశ్నలను అప్పీలుదారు తరఫు న్యాయవాదిని అడిగిన సుప్రీంకోర్టు ఫిర్యాదు కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పీలు దాఖలు చేయలేదు.
READ MORE:IND vs AUS: బ్యాటింగ్లో కోహ్లీ విఫలం.. రిటైర్ అయి లండన్లో నివసించు అంటూ ట్రోల్స్
వాస్తవానికి.. దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు గత ఏడాది మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ మసీదులోకి ప్రవేశించి జై శ్రీరామ్ నినాదాలు చేశారని, అక్కడున్న వారిని బెదిరించారని ఆరోపించారు. నిందితులిద్దరూ ముస్లింలను శాంతియుతంగా బతకనివ్వమని బెదిరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఇరువురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 295A (మతపరమైన భావాలను దౌర్జన్యం చేసే ఉద్దేశ్యంతో చేసిన చర్యలు), 447 (అతిక్రమం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.
READ MORE:Farmer Won The Lottery: రైతుకు రూ.287 కోట్ల లాటరీ.. అంతలోపే ఊహించని ప్రమాదం..
కాగా.. ఇద్దరు యువకులు తమపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది సెప్టెంబరు 13న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది. నిందితులిద్దరికీ రిలీఫ్ ఇస్తూ..ఈ నినాదాలు చేయడం ద్వారా ప్రజా జీవితంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపవని హైకోర్టు పేర్కొంది. దీంతో ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!