Uttar Pradesh: పెళ్లి ఇంట్లో మహిళలు డ్యాన్స్ చేస్తుండగా రెచ్చిపోయిన పోకిరీలు..
గ్రామంలో పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి కుమార్తె వివాహంలో కొందరు వ్యక్తులు రచ్చ చేశారు. సరదాగా డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న వధువు తరఫు మహిళలతో కలిసి కొందరు పోకిరీలు మధ్యలో వచ్చి వారితో బలవంతంగా డ్యాన్స్ చేయించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. ఓ మహిళ నేలపై పడిపోయింది. అయితే.. పక్కనున్న కొంతమంది గమనించి వారిని అక్కడి నుంచి పంపించారు. అంతటితో ఆగకుండా.. పోరంబోకులు వివాహ ఊరేగింపుపై దాడి చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులను కర్రలతో వెంబడించి మరీ కొట్టారు. అంతేకాకుండా.. కాల్పులు కూడా జరిగాయి. ఈ క్రమంలో.. వధువు తరుఫున ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.
Treatment With Torch Lighting: విద్యుత్ నిలిచిపోవడంతో ఫోన్ లైట్స్ తో రోగులకు చికిత్స..
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్ పూర్ గ్రామానికి చెందిన పెద్దాయన కుమార్తె వివాహం బుధవారం జరిగింది. పెళ్లి ఊరేగింపు వచ్చే సమయంలో ఇంటి వద్ద బంధువులు, మహిళలు డీజే పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో గ్రామానికి చెందిన అమిత్ సింగ్, ప్రమోద్ సింగ్, రాంపాల్ సింగ్, సోనూ సింగ్, అవనీష్, గుడ్డు, సునీల్ తదితరులు అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తూ మహిళలను వేధించడం ప్రారంభించారు. వారు అడ్డుకుని దుర్భాషలాడారు. పెళ్లికి వచ్చిన బంధువులు నిందితులను అక్కడి నుంచి పంపించారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పెళ్లి ఊరేగింపుగా వస్తున్న వారిపై నిందితులు కర్రలతో దాడి చేశారు.
Planet Parade: ఆకాశంలో అద్భుతం.. జూన్ 3న ఒకే వరసలోకి ఆరు గ్రహాలు..
పెళ్లికి వచ్చిన అతిథులపై రాళ్లు రువ్వడం, కాల్పులు జరిపారు. నిందితులు కొన్ని బైక్లను కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే నిందితులు పరారయ్యారు. ఈ ఘటనతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. అనంతరం పోలీసుల సమక్షంలో ఊరేగింపును పూర్తి చేశారు. ఈ ఘటనతో తన కుటుంబ సభ్యులు భయపడుతున్నారని.. తమ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా పెద్దాయన పోలీసులను కోరారు. మరోవైపు.. క్షతగాత్రులను ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు ఇన్చార్జి అశ్వనీ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. వారిని వెతికిపట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!