Jagtial: ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. యువకుడిని హ*త్య చేసిన యువతి బంధువులు
- జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య
- ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. హ*త్య చేసిన యువతి బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వెల్గటూర్ మండలం కిషన్ రావు గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ (26)ను హత్య చేశారు యువతి తల్లిదండ్రులు. నేతకాని కులానికి చెందిన సూర మల్లేష్ కి గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. మా కొడుకును మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మద్యం తాగించి హత్య చేశారని మృతుని బాబాయి ఆరోపించాడు. చంపిన తరువాత మీ కొడుకుని చంపినం అంటూ ఫోన్ చేసినట్లు తెలిపారు. మా కొడుకు ఆ అమ్మాయిని మర్చిపోయినప్పటికీ ఆమె మాత్రం వదలకుండా ఫోన్స్ చేస్తుందని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read:Army Dogs: ఆర్మీ డాగ్స్ రక్త దానం.. ఈ విషయాలు తెలుసా?
Also Read
నిన్న ఎవరో ముగ్గురు వచ్చి మా కొడుకు మల్లేష్ ను తీసుకెళ్లి చంపారని తండ్రి తెలిపాడు. అమ్మాయికి కూడా మా తమ్ముడు మల్లేష్ పై ఇష్టం ఉండేదని, మాది తక్కువ కులం అని అమ్మాయికి చెప్పినా అమ్మాయి తరచు ఫోన్స్ చేస్తుండేదని.. కావాలని అమ్మాయి తల్లిదండ్రులు చంపారని మల్లేష్ అక్క ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మల్లేష్ మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. పరువు హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Also Read:Jaishankar: టీఆర్ఎఫ్ను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించడాన్ని స్వాగతించిన భారత్
యువకుడు మల్లేష్ హత్య కేసులో మృతుడి బంధువులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. రాజీ కుదుర్చుకోవాలని వెల్గటూర్ ఎస్ఐ ఒత్తిడి చేసినట్లు మృతుడి బంధువులు తెలిపారు.. మీరు నిరసన చేస్తే మేము చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగారని.. హత్యలు చేసి పరిహారం ఇస్తారా అంటూ బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరగాలని బంధువులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!