Jagtial: ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. యువకుడిని హ*త్య చేసిన యువతి బంధువులు
- జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య
- ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. హ*త్య చేసిన యువతి బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వెల్గటూర్ మండలం కిషన్ రావు గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ (26)ను హత్య చేశారు యువతి తల్లిదండ్రులు. నేతకాని కులానికి చెందిన సూర మల్లేష్ కి గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. మా కొడుకును మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మద్యం తాగించి హత్య చేశారని మృతుని బాబాయి ఆరోపించాడు. చంపిన తరువాత మీ కొడుకుని చంపినం అంటూ ఫోన్ చేసినట్లు తెలిపారు. మా కొడుకు ఆ అమ్మాయిని మర్చిపోయినప్పటికీ ఆమె మాత్రం వదలకుండా ఫోన్స్ చేస్తుందని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read:Army Dogs: ఆర్మీ డాగ్స్ రక్త దానం.. ఈ విషయాలు తెలుసా?
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
నిన్న ఎవరో ముగ్గురు వచ్చి మా కొడుకు మల్లేష్ ను తీసుకెళ్లి చంపారని తండ్రి తెలిపాడు. అమ్మాయికి కూడా మా తమ్ముడు మల్లేష్ పై ఇష్టం ఉండేదని, మాది తక్కువ కులం అని అమ్మాయికి చెప్పినా అమ్మాయి తరచు ఫోన్స్ చేస్తుండేదని.. కావాలని అమ్మాయి తల్లిదండ్రులు చంపారని మల్లేష్ అక్క ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మల్లేష్ మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. పరువు హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Also Read:Jaishankar: టీఆర్ఎఫ్ను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించడాన్ని స్వాగతించిన భారత్
యువకుడు మల్లేష్ హత్య కేసులో మృతుడి బంధువులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. రాజీ కుదుర్చుకోవాలని వెల్గటూర్ ఎస్ఐ ఒత్తిడి చేసినట్లు మృతుడి బంధువులు తెలిపారు.. మీరు నిరసన చేస్తే మేము చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగారని.. హత్యలు చేసి పరిహారం ఇస్తారా అంటూ బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరగాలని బంధువులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!