China: చైనా వింత నిర్ణయం.. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఆస్పత్రిలోనే ‘ హోమ్ వర్క్ జోన్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో మిస్టరీ వ్యాధి ప్రబలుతోంది. న్యూమోనియాతో అక్కడి పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది అనారోగ్యంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వ్యాధి విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా నుంచి మరింత సమాచారం కావాలని కోరింది. అయితే సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులే అని చైనా ప్రభుత్వం చెప్పింది.
ఇదిలా ఉంటే చైనా తీసుకుంటున్న చర్యలు అక్కడ ప్రజాగ్రహానికి కారణమువతున్నాయి. ఆస్పత్రుల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో అనారోగ్యం బారిన పడిన విద్యార్థుల కోసం ‘‘ హోమ్వర్క్ జోన్స్’’ ఏర్పాటు చేయడం ప్రారంభించింది. దీనిపై అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా స్కూల్ హోమ్వర్క్ చేయడానికి ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు నేర్చుకోవాలనే విద్యార్థులకు ఇవి సహాయంగా ఉంటాయని మరికొందరు వాదించారు. విద్యార్థులు చదువుల్లో వెనకబడి ఉండకుండా ఇవి ఉపయోగపడుతాయని వాదిస్తున్నారు.
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
Read Also: Mahesh Babu: యానిమల్ కి ప్లస్ అవుతాడని బాబుని తీసుకొస్తే చివరికి బాబే మైనస్ అయ్యాడే?
స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. విద్యార్థులు అనారోగ్యంతో ఉన్నప్పుడు చదువుకోవడానికి తూర్పు చైనాలోని ఆసుపత్రులలో డెస్క్లు, కుర్చీలు మరియు ఇన్ఫ్యూషన్ స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి పాఠశాల పనుల్లో సహాయం చేస్తున్నారు. ఆస్పత్రులు అనారోగ్యం నుంచి కోలుకోవడంతో పాటు నేర్చుకోవాలనే పిల్లలకు మంచి వాతావరణాన్ని అందిస్తున్నాయని నివేదించింది.
చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి, మి ఫెంగ్ఆదివారం మాట్లాడుతూ.. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు అనేక వ్యాధి కారకాలు కారణమవుతున్నాయని, ముఖ్యంగా ఇన్ఫ్లూఎంజా వ్యాప్తి కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. 2019లో చైనా నగరమైన వూహాన్లో కోవిడ్-19 మహమ్మారి బయటపడింది. ఈ నేపథ్యంలో చైనాలో వెలుగు చూస్తున్న కొత్త వ్యాధి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది.
తాజావార్తలు
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!