Maratha Reservation: మరాఠా కోటా వివాదం.. ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు, అజిత్ పవార్ పోస్టర్ ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maratha Reservation: విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన ఆందోళనలు మహారాష్ట్రలో మరోసారి తీవ్రరూపం దాల్చాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ ఇంటికి సోమవారం నిప్పు పెట్టారు. ఆయన ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఆయన శరద్ పవార్ వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.
బీడ్ జిల్లాలో నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, నిప్పంటించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్లో ఆయన బంగ్లాలో భారీ మంటలు, పొగలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు కనిపించింది. ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులు లేదా సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన వెల్లడించారు. మేమంతా క్షేమంగా ఉన్నామని, కానీ అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. బీడ్లో మాజీ మంత్రి జయదత్తాజీ క్షీరసాగర్ కార్యాలయానికి నిప్పంటించిన మరో ఘటన చోటుచేసుకుంది. ఆయన ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన వ్యక్తి. మహారాష్ట్రలోని వడ్గావ్ నింబాల్కర్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పోస్టర్లను ధ్వంసం చేసి మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
Also Read: Russia: ఉక్రెయిన్ యుద్ధాన్ని అమెరికా పెంచుతోంది.. అగ్రరాజ్యంపై రష్యా మండిపాటు
మహారాష్ట్రలో ఉద్యోగాలు, ద్యలో మరాఠా కోటాలను కోరుతూ జరిగిన ఆందోళనలు ఇటీవల ముఖ్యాంశాలుగా మారాయి. రిజర్వేషన్ అంశంపై శివసేన నాయకుడు హేమంత్ పాటిల్ హింగోలి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. యవత్మాల్లోని నిరసన వేదిక వద్ద ఆయన తన రాజీనామా లేఖ రాశారు. ఎంపీ రాజీనామాపై స్పందిస్తూ, అక్టోబర్ 25 నుండి నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే పాటిల్, ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలోని మరాఠా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలని సూచించారు. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త మనోన్ జరంగే పాటిల్ అక్టోబర్ 25 నుంచి జాల్నా జిల్లా అంతర్వాలి సారథి గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఏ రాజకీయ నాయకుడిని గ్రామంలోకి అనుమతించవద్దని పాటిల్ కోరడంతో, గ్రామస్థులు ఏ రాజకీయ పార్టీ నాయకుడిని గ్రామంలోకి అనుమతించలేదు. జిల్లా అధికారులు, వైద్యులు వైద్యపరీక్షలు చేసేందుకు ప్రయత్నించినా.. నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి.
తాజావార్తలు
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్బ్యాగ్స్, 10.1″ టచ్స్క్రీన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!