Maratha Reservation: మరాఠా కోటా వివాదం.. ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు, అజిత్ పవార్ పోస్టర్ ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maratha Reservation: విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన ఆందోళనలు మహారాష్ట్రలో మరోసారి తీవ్రరూపం దాల్చాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ ఇంటికి సోమవారం నిప్పు పెట్టారు. ఆయన ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఆయన శరద్ పవార్ వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.
బీడ్ జిల్లాలో నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, నిప్పంటించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్లో ఆయన బంగ్లాలో భారీ మంటలు, పొగలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు కనిపించింది. ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులు లేదా సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన వెల్లడించారు. మేమంతా క్షేమంగా ఉన్నామని, కానీ అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. బీడ్లో మాజీ మంత్రి జయదత్తాజీ క్షీరసాగర్ కార్యాలయానికి నిప్పంటించిన మరో ఘటన చోటుచేసుకుంది. ఆయన ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన వ్యక్తి. మహారాష్ట్రలోని వడ్గావ్ నింబాల్కర్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పోస్టర్లను ధ్వంసం చేసి మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
Also Read: Russia: ఉక్రెయిన్ యుద్ధాన్ని అమెరికా పెంచుతోంది.. అగ్రరాజ్యంపై రష్యా మండిపాటు
మహారాష్ట్రలో ఉద్యోగాలు, ద్యలో మరాఠా కోటాలను కోరుతూ జరిగిన ఆందోళనలు ఇటీవల ముఖ్యాంశాలుగా మారాయి. రిజర్వేషన్ అంశంపై శివసేన నాయకుడు హేమంత్ పాటిల్ హింగోలి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. యవత్మాల్లోని నిరసన వేదిక వద్ద ఆయన తన రాజీనామా లేఖ రాశారు. ఎంపీ రాజీనామాపై స్పందిస్తూ, అక్టోబర్ 25 నుండి నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే పాటిల్, ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలోని మరాఠా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలని సూచించారు. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త మనోన్ జరంగే పాటిల్ అక్టోబర్ 25 నుంచి జాల్నా జిల్లా అంతర్వాలి సారథి గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఏ రాజకీయ నాయకుడిని గ్రామంలోకి అనుమతించవద్దని పాటిల్ కోరడంతో, గ్రామస్థులు ఏ రాజకీయ పార్టీ నాయకుడిని గ్రామంలోకి అనుమతించలేదు. జిల్లా అధికారులు, వైద్యులు వైద్యపరీక్షలు చేసేందుకు ప్రయత్నించినా.. నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!