Maratha Reservation: మరాఠా కోటా వివాదం.. ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు, అజిత్ పవార్ పోస్టర్ ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maratha Reservation: విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన ఆందోళనలు మహారాష్ట్రలో మరోసారి తీవ్రరూపం దాల్చాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ ఇంటికి సోమవారం నిప్పు పెట్టారు. ఆయన ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఆయన శరద్ పవార్ వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.
బీడ్ జిల్లాలో నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, నిప్పంటించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్లో ఆయన బంగ్లాలో భారీ మంటలు, పొగలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు కనిపించింది. ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులు లేదా సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన వెల్లడించారు. మేమంతా క్షేమంగా ఉన్నామని, కానీ అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. బీడ్లో మాజీ మంత్రి జయదత్తాజీ క్షీరసాగర్ కార్యాలయానికి నిప్పంటించిన మరో ఘటన చోటుచేసుకుంది. ఆయన ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన వ్యక్తి. మహారాష్ట్రలోని వడ్గావ్ నింబాల్కర్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పోస్టర్లను ధ్వంసం చేసి మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: Russia: ఉక్రెయిన్ యుద్ధాన్ని అమెరికా పెంచుతోంది.. అగ్రరాజ్యంపై రష్యా మండిపాటు
మహారాష్ట్రలో ఉద్యోగాలు, ద్యలో మరాఠా కోటాలను కోరుతూ జరిగిన ఆందోళనలు ఇటీవల ముఖ్యాంశాలుగా మారాయి. రిజర్వేషన్ అంశంపై శివసేన నాయకుడు హేమంత్ పాటిల్ హింగోలి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. యవత్మాల్లోని నిరసన వేదిక వద్ద ఆయన తన రాజీనామా లేఖ రాశారు. ఎంపీ రాజీనామాపై స్పందిస్తూ, అక్టోబర్ 25 నుండి నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే పాటిల్, ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలోని మరాఠా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలని సూచించారు. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త మనోన్ జరంగే పాటిల్ అక్టోబర్ 25 నుంచి జాల్నా జిల్లా అంతర్వాలి సారథి గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఏ రాజకీయ నాయకుడిని గ్రామంలోకి అనుమతించవద్దని పాటిల్ కోరడంతో, గ్రామస్థులు ఏ రాజకీయ పార్టీ నాయకుడిని గ్రామంలోకి అనుమతించలేదు. జిల్లా అధికారులు, వైద్యులు వైద్యపరీక్షలు చేసేందుకు ప్రయత్నించినా.. నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!