Gitam Vizag: విశాఖ గీతం వర్సిటీ మెడికల్ కాలేజీ దగ్గర హై టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ గీతం వర్సిటీ మెడికల్ కాలేజీ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖ ఋషికొండలోని గీతం మెడికల్ కాలేజ్ ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ,పోలీసు యంత్రంగం రంగంలోకి దిగాయి. మెడికల్ కాలేజ్ వైపు రహదారుల ను మూసివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. డీసీపీ సుమీత్ గరుడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను గతంలో తొలగించగా….ఇప్పుడు ఆ భూముల్లో ఫెన్సింగ్ వేసే పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 45 ఎకరాలు మేర ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగిందని గతంలోనే రెవెన్యూ శాఖ తేల్చింది. గీతం యూనివర్సిటీ చైర్మన్ గా టీడీపీ నేత, బాల కృష్ణ అల్లుడు శ్రీభరత్ వ్యవహరిస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం గీతం భూముల్లోకి వచ్చిందనేది టీడీపీ ఆరోపణ. ఈ నేపథ్యంలో మీడియా సహా బయట వ్యక్తులు ఎవరు యూనివర్సిటీ వైపు వెళ్ల కుండా నియంత్రిస్తున్నారు పోలీసులు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇదిలా ఉంటే… రూరల్ ఎమ్మర్వో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఆక్రమణలకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నాం అన్నారు. అప్పుడు బోర్డులు మాత్రమే పెట్టాము. మరల ఆక్రమణ కు గురికాకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు పెన్సింగ్ వేసాం. సర్వే నెంబర్ 37,38 లో 14 ఎకరాలు ప్రభుత్వ భూమి మెడికల్ కళాశాల వద్ద ఉంది. అందులో గీతం ప్రాంగణంలో ఉన్న 5.72 ఎకరాలకు ఫెన్సింగ్ వేశామన్నారు. కోర్టు పరిధిలో 40 ఎకరాల వరకు ఉంది అందులో మేము జోక్యం చేసుకోలేదన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!