High Court : ట్రాన్స్జెండర్లకు 1% కోటా ఉండేలా చూడాలి.. హైకోర్ట్ ఆదేశం..
- అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలి.
- కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశం.
- ఇంకా రిజర్వేషన్లు కల్పించలేదని ఆగ్రహం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు (transgender persons) ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాల్లో సమానమైన విధానాన్ని అవలంబిస్తున్నదని పేర్కొన్న కోర్టు, అయితే వారికి ఇంకా రిజర్వేషన్లు కల్పించలేదని పేర్కొంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ రాజశేఖర్ మంథా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2014లో, TET 2022లో విజయం సాధించిన లింగమార్పిడి వ్యక్తి చేసిన పిటిషన్ పై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. కానీ కౌన్సెలింగ్ కానీ ఇంటర్వ్యూకు కాని పిలవబడలేదు.
శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులో, పార్ట్ 3 కింద వారి హక్కులను పరిరక్షించే ఉద్దేశ్యంతో హిజ్రాలు, నపుంసకులు, బైనరీ జెండర్ లను మినహాయించి, ‘మూడవ లింగం’గా పరిగణించాలని 2014లో సుప్రీంకోర్టు ప్రకటించినట్లు జస్టిస్ మంథా పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం లింగమార్పిడి వ్యక్తుల స్వీయ గుర్తింపు లింగాన్ని నిర్ణయించే హక్కును కూడా సమర్థించింది. అలాగే మగ, ఆడ లేదా మూడవ లింగం వంటి వారి లింగ గుర్తింపుకు చట్టపరమైన గుర్తింపును మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
వారిని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పౌరులుగా పరిగణించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ నియామకాల్లో అన్ని రకాల రిజర్వేషన్లను పొడిగించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని జస్టిస్ మంథా పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా మరియు శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ నవంబర్ 30, 2022న ఎలాంటి వివక్ష లేకుండా ట్రాన్స్జెండర్లు సమాన ఉద్యోగావకాశానికి అర్హులని నోటిఫికేషన్ జారీ చేసిందని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ హైకోర్టుకు తెలియజేశారు.
రాష్ట్రంలోనే ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాల్లో సమానమైన విధానాన్ని అవలంబిస్తున్నట్లు నోటిఫికేషన్ ద్వారా స్పష్టమవుతోందని కోర్టు పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు ఇంకా కల్పించలేదని జస్టిస్ మంథా తెలిపారు. పిటిషనర్ ను ప్రత్యేక కేసుగా పరిగణించి ఇంటర్వ్యూ మరియు కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేయాలని పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కార్యదర్శిని కూడా ఆయన ఆదేశించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!