Hibatullah Akhundzada: పాక్ – ఆఫ్ఘన్ యుద్ధం.. ఇంతకీ హిబతుల్లా అఖుంద్జాదా ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hibatullah Akhundzada: కాబూల్పై పాకిస్థాన్ వైమానిక దాడి తరువాత, ఆఫ్ఘన్ దళాలు పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్పై దాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఆఫ్ఘన్ అనేక పాక్ సరిహద్దు అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఉద్రిక్తతకు కేంద్రంగా ఉన్న అత్యంత ప్రముఖమైన పేరు హిబతుల్లా అఖుండ్జాదా. పాక్ – ఆఫ్ఘన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం ఏమిటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Bihar Elections: లాలూ కుటుంబంలో ముదిరిన వివాదం..
Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
హిబతుల్లా అఖుంద్జాదా ఎవరు?
హిబతుల్లా అఖుంద్జాదాను “అమీర్ అల్-ము’మినిన్” అని పిలుస్తారు. దీని అర్థం తాలిబాన్లో “విశ్వాసుల కమాండర్” అని చెబుతారు. 1960లలో జన్మించిన అఖుంద్జాదా నూర్జాయ్ తెగకు చెందినవాడు. ఆయన చాలా కాలంగా షరియా కోర్టులకు అధిపతిగా ఉన్నాడు. తాలిబాన్ మతపరమైన వ్యవహారాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఆయన ఒకరిగా పరిగణించబడతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయనకు సైనిక పరమైన అనుభవం ఏమీలేదు. అయినప్పటికీ ఆయన తాలిబాన్లో అత్యంత శక్తివంతమైన, తుది నిర్ణయం తీసుకునే వ్యక్తి స్థాయికి ఎదిగారు.
తాలిబన్ల సుప్రీం నాయకుడిగా ఎలా ఎదిగారు..
మే 2016లో అమెరికా డ్రోన్ దాడిలో అఖ్తర్ మన్సూర్ మరణించిన తర్వాత అఖుంద్జాదా తాలిబన్ల సుప్రీం నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆయన మన్సూర్ డిప్యూటీగా ఉండటంతో పాటు, తాలిబన్ల మత ఐక్యతకు చిహ్నంగా గుర్తింపు పొందారు. 2021లో ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పుడు, అఖుంద్జాదా తనను తాను “ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్” సుప్రీం నాయకుడిగా ప్రకటించుకున్నాడు.
అదే ఆయన బలం..
ఆయన గొప్ప బలం ఏమిటంటే ఎప్పుడూ తెర వెనక ఉండటమే. ఆయన చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఇటీవల ఫోటోలు లేదా వీడియోలు ఏవీ కూడా బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. ఆయన ఎక్కువగా కాందహార్లో నివసిస్తాడు, కేవలం తన సన్నిహిత మతపరమైన వర్గం ద్వారా ఆదేశాలు జారీ చేస్తాడు. ఆయన ఆఫ్ఘన్ సామాజిక నిర్మాణాన్ని మార్చాడని విశ్లేషకులు చెబుతారు. విద్య, ఉద్యోగం, ప్రజా జీవితంలో మహిళలపై ఆంక్షలు ఆయన ఆదేశాల మేరకు దేశంలో అమలు చేయబడ్డాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి, షరియా చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తున్నట్లు ఆయన అధికారం చేపట్టిన తర్వాత ప్రకటించారు. ఈ నిర్ణయాలు ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) వారెంట్ జారీ చేయడానికి దారితీశాయి.
పాక్ వైమానిక దాడులు, సరిహద్దు వివాదాలతో అఖుండ్జాదా తీవ్రంగా కలత చెందినట్లు సమాచారం. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత పర్యటనకు ముందు అఖుండ్జాదా జారీ చేసిన “ప్రత్యేక సూచనలు” భారతదేశంతో దౌత్య సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాందిగా భావిస్తున్నారు. ప్రస్తుత తాలిబాన్ ప్రభుత్వం ఇప్పుడు పాకిస్థాన్పై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఈ ప్రాంతాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Eiffel Tower Demolition: ఈఫిల్ టవర్ కూల్చివేత ? ప్రపంచ వింత మాయం కానుందా!
తాజావార్తలు
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
-
Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
-
Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!