Hibatullah Akhundzada: పాక్ – ఆఫ్ఘన్ యుద్ధం.. ఇంతకీ హిబతుల్లా అఖుంద్జాదా ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hibatullah Akhundzada: కాబూల్పై పాకిస్థాన్ వైమానిక దాడి తరువాత, ఆఫ్ఘన్ దళాలు పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్పై దాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఆఫ్ఘన్ అనేక పాక్ సరిహద్దు అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఉద్రిక్తతకు కేంద్రంగా ఉన్న అత్యంత ప్రముఖమైన పేరు హిబతుల్లా అఖుండ్జాదా. పాక్ – ఆఫ్ఘన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం ఏమిటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Bihar Elections: లాలూ కుటుంబంలో ముదిరిన వివాదం..
Also Read
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
హిబతుల్లా అఖుంద్జాదా ఎవరు?
హిబతుల్లా అఖుంద్జాదాను “అమీర్ అల్-ము’మినిన్” అని పిలుస్తారు. దీని అర్థం తాలిబాన్లో “విశ్వాసుల కమాండర్” అని చెబుతారు. 1960లలో జన్మించిన అఖుంద్జాదా నూర్జాయ్ తెగకు చెందినవాడు. ఆయన చాలా కాలంగా షరియా కోర్టులకు అధిపతిగా ఉన్నాడు. తాలిబాన్ మతపరమైన వ్యవహారాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఆయన ఒకరిగా పరిగణించబడతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయనకు సైనిక పరమైన అనుభవం ఏమీలేదు. అయినప్పటికీ ఆయన తాలిబాన్లో అత్యంత శక్తివంతమైన, తుది నిర్ణయం తీసుకునే వ్యక్తి స్థాయికి ఎదిగారు.
తాలిబన్ల సుప్రీం నాయకుడిగా ఎలా ఎదిగారు..
మే 2016లో అమెరికా డ్రోన్ దాడిలో అఖ్తర్ మన్సూర్ మరణించిన తర్వాత అఖుంద్జాదా తాలిబన్ల సుప్రీం నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆయన మన్సూర్ డిప్యూటీగా ఉండటంతో పాటు, తాలిబన్ల మత ఐక్యతకు చిహ్నంగా గుర్తింపు పొందారు. 2021లో ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పుడు, అఖుంద్జాదా తనను తాను “ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్” సుప్రీం నాయకుడిగా ప్రకటించుకున్నాడు.
అదే ఆయన బలం..
ఆయన గొప్ప బలం ఏమిటంటే ఎప్పుడూ తెర వెనక ఉండటమే. ఆయన చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఇటీవల ఫోటోలు లేదా వీడియోలు ఏవీ కూడా బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. ఆయన ఎక్కువగా కాందహార్లో నివసిస్తాడు, కేవలం తన సన్నిహిత మతపరమైన వర్గం ద్వారా ఆదేశాలు జారీ చేస్తాడు. ఆయన ఆఫ్ఘన్ సామాజిక నిర్మాణాన్ని మార్చాడని విశ్లేషకులు చెబుతారు. విద్య, ఉద్యోగం, ప్రజా జీవితంలో మహిళలపై ఆంక్షలు ఆయన ఆదేశాల మేరకు దేశంలో అమలు చేయబడ్డాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి, షరియా చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తున్నట్లు ఆయన అధికారం చేపట్టిన తర్వాత ప్రకటించారు. ఈ నిర్ణయాలు ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) వారెంట్ జారీ చేయడానికి దారితీశాయి.
పాక్ వైమానిక దాడులు, సరిహద్దు వివాదాలతో అఖుండ్జాదా తీవ్రంగా కలత చెందినట్లు సమాచారం. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత పర్యటనకు ముందు అఖుండ్జాదా జారీ చేసిన “ప్రత్యేక సూచనలు” భారతదేశంతో దౌత్య సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాందిగా భావిస్తున్నారు. ప్రస్తుత తాలిబాన్ ప్రభుత్వం ఇప్పుడు పాకిస్థాన్పై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఈ ప్రాంతాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Eiffel Tower Demolition: ఈఫిల్ టవర్ కూల్చివేత ? ప్రపంచ వింత మాయం కానుందా!
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!