షాకింగ్.. విడిపోతున్నట్లు ప్రకటించిన హీరో ధనుష్-ఐశ్వర్య దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విడాకులు తీసుకుంటున్న జాబితాలో మరో ప్రముఖ జంట చేరింది. తమిళ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 2004లో వీరి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి విడాకులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గత 18 ఏళ్ల నుంచి స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రయాణం కొనసాగించామని… కానీ ఇప్పుడు వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యామని హీరో ధనుష్ ఓ లేఖ ద్వారా వివరించాడు.
Read Also: మహేష్ చెల్లిగా సాయి పల్లవి..?
Also Read
వ్యక్తిగతంగా తాను, ఐశ్వర్య సమయం తీసుకోవాలని భావించామని… తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని, ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత గోప్యత అవసరమని ధనుష్ విజ్ఞప్తి చేశాడు. కాగా హీరో ధనుష్ తమిళంలో ప్రముఖ దర్శక, నిర్మాత కస్తూరి రాజా కుమారుడు. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ధనుష్కు సోదరుడు. అటు ఐశ్వర్య రజనీకాంత్ పలు సినిమాలకు దర్శకత్వం వహించింది. ధనుష్ హీరోగా ‘3’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది. ఈ మూవీలోని వై దిస్ కొలవెరి సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. అయితే ధనుష్-ఐశ్వర్య మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచే ధనుష్-ఐశ్వర్య దంపతుల మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
OM NAMASHIVAAYA 🙏🙏🙏 pic.twitter.com/XXFo8BDRIO
— Dhanush (@dhanushkraja) March 23, 2021
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..