తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సాయంత్రం కుండపోత వర్షం కురుస్తోంది. నిమిషాల వ్యవధిలో ఆకాశంలో మబ్బులు కమ్మేసి భారీ వానలు పడుతున్నాయి. భారీ వర్షం కారణంగా అంబర్పేట్- మూసారాంబాగ్ బ్రిడ్జి నీటమునిగింది. చాదర్ఘాట్ బ్రిడ్జి నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైదబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. గండిపేట చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు.
ఇక మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది.
రాష్ట్రంలో కురుస్తున్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి వాగులో గేదెలు కొట్టుపోయాయి. సిరిసిల్లలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. పాత బస్టాండులోని వాహనాలు నీటమునిగాయి. అటు సంగారెడ్డి జిల్లాలో వాన దంచికొట్టింది.
Also Read
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
భారీ వర్షానికి వాగులు అలుగుపారాయి. సింగూరు ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు మంచి నీటి చెరువు అలుగు పడింది. నీరు ఉదృతంగా ప్రహించడంతో ఇల్లందు- సత్యనారాయణ పురం మధ్య రాకపోకలు నిలిచిపొయ్యాయి. ఏపీలోను పలు చోట్ల భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణశాఖ. దీని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని చెప్పింది. నేటి నుంచి ఈనెల 11 వరకు తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు.
తాజావార్తలు
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!