Heavy Rains: మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. 14 మంది మృతి
- మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో వర్ష బీభత్సం
- వర్షాలతో ఇప్పటి వరకు 14 మంది మృతి
- పిడుగుపాటు కారణంగా 11 మంది మృతి
- రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎల్లో.. ఆరెంజ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. జూన్ 1 నుంచి ప్రారంభమైన వర్షాల ప్రభావంతో.. ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. ఇందులో పిడుగుపాటు కారణంగా 11 మంది మృతి చెందారు. డివిజనల్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన ప్రాథమిక సర్వే నివేదిక ప్రకారం.. గత రెండు రోజుల్లో పర్భానీ, హింగోలి జిల్లాల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి. జూన్ 1 నుంచి మరఠ్వాడాలోని ఏడు జిల్లాల్లో వర్షాల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో నాలుగు మరణాలు గత రెండు రోజుల్లోనే సంభవించాయి. నలుగురు బాధితుల్లో ఇద్దరు 14 ఏళ్ల బాలుడు, 40 ఏళ్ల మహిళ ఉన్నారు.
Red Fort Terror Attack: పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ క్షమాభిక్ష తిరస్కరణ..
Also Read
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
వరద నీటిలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందగా, ఆవుల కొట్టం కూలి ఒకరు మృతి చెందారు. మరాఠ్వాడాలోని మొత్తం ఎనిమిది జిల్లాల్లో ఏడింటిలో ఈ మరణాలు సంభవించాయి. సర్వే నివేదిక ప్రకారం, లాతూర్ జిల్లాలో అత్యధికంగా నాలుగు మరణాలు సంభవించగా, పర్భానీ మరియు నాందేడ్ ఒక్కొక్కటి మూడు మరణాలు నమోదయ్యాయి. మరో నాలుగు జిల్లాలు.. జల్నా, హింగోలి, బీడ్ మరియు ధరాశివ్ ఒక్కొక్కరు మరణించారు. జూన్ 1 నుంచి మరాఠ్వాడాలోని మొత్తం ఎనిమిది జిల్లాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మనుషులే కాకుండా 251 జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. గత రెండు రోజుల్లో 99 జంతువులు చనిపోయాయి.
US: తల్లి, సోదరుడ్ని కాల్చి ఎన్నారై ఆత్మహత్య
భారీ వర్షాల కారణంగా జూన్ 12న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లను వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు.. బీడ్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో.. మజల్గావ్ తాలూకాలోని కోతల గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నదికి వరద పోటెత్తింది. లాతూర్ జిల్లాలోని నెల్వాడ్ గ్రామంలో వ్యవసాయం భూమి, రోడ్లు జలమయమయ్యాయి. గ్రామం నుంచి బయటకు వెళ్లే రహదారిపై నుంచి నీరు ప్రవహించడంతో గ్రామస్తులు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ భూమిలోకి నీరు చేరడంతో మట్టి కొట్టుకుపోయింది. వాగులు పొంగి పొర్లడంతో రహదారులు మూసుకుపోయాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!