Botsa Satyanarayana: ఉగాది తర్వాత ఆ సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్.. ఈ 6 నెలలే అరుపులు, కేకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్.. ఈ ఆరు నెలలు మాత్రమే అరుపులు, కేకలు ఉంటాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యానారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఒక సెలబ్రిటీ రాష్ట్రం అంతా తిరుగుతూ మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిపైన అసహనం ప్రదర్శిస్తున్నారు.. 40 ఏళ్ల ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంగితజ్ఞానం ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రజలు తరిమికొడితే హైదరాబాద్ లో కాపురం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. ఇక, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అని విమర్శించిన ఆయన.. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
రైతుల ఆత్మహత్యలు చంద్రబాబు హయాంలోనే జరగలేదా..? చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అని సూచించారు బొత్స.. సెల్ ఫోన్ నేను కనిపెట్టానని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడడం లేదా? అని ఎద్దేవా చేశారు. అసలు లోకేష్ లెక్కల్లో మనిషే కాదన్న బొత్స.. సెలబ్రిటీ (పవన్ కల్యాణ్)కి టీడీపీ పాలన నచ్చడం అంటే పచ్చకామెర్ల వాళ్ళకు లోకం పచ్చగా కనిపించినట్టే అని సెటైర్లు వేశారు. టీడీపీ హయాంలో దోపిడీ.. పెత్తందారి వ్యవస్థ కనిపించలేదా.. ఋషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతుందని ఏడాది క్రితమే చెప్పానని గుర్తుచేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు జరుగితే నీకేంటి నొప్పి.. అని మండిపడ్డ ఆయన.. అందుకే ప్రజలు నిన్ను హర్షించడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించేస్తానంటున్నారు.. అది ఎందుకో.. దాని వెనుక ఉన్న ప్రణాళికలు ఏంటో సెలబ్రిటీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
సంక్షేమం వైఎస్సార్ పేటెంట్.. దాని మీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మంత్రి బొత్స.. ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్ అవుతుందని జోస్యం చెప్పిన ఆయన.. ఈ ఆరునెలల కాలమే అరుపులు, కేకలు ఉంటాయన్నారు. 40 ఏళ్ల ఇండస్త్రీకి 4 ఏళ్ల పాలనకి తేడా సున్నా మాత్రమే.. మేం చేసిన మంచి పనులు 100 చెప్పగలుగుతాం.. మీరు ఏం చేశారు? అని ప్రశ్నించారు. రాజధానిలో 30 వేల కోట్ల భూములు కొనేశారని మాట్లాడడానికి అది నాలుకా, తాటిమట్టా అంటు ఫైర్ అయ్యారు. ఇక, తెలంగాణలో దోపిడీకి చంద్రబాబు కారకుడన్న ఆయన.. సైకిల్ పై కాలేజ్ కు వెళ్లిన చంద్రబాబు ఆస్తులు ఎంత..? స్కూటర్ మీద వెళ్లిన బొత్స ఆస్తులు విలువ ఎంత..?.. నక్కకి.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..! అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చంద్రబాబు చెప్పగలరా..? అంటూ సవాల్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!