Husnabad : కలెక్టర్ కాళ్లపై పడి ఏడ్చిన మహిళా రైతు.. నీళ్లలో కొట్టుకుపోయిన ధాన్యం
- భీకరంగా కురిసిన వాన
- నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం
- కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husnabad : మొంథా తుఫాన్ నిండా ముంచింది. రైతులకు చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసింది. ఇంకో రెండు రోజులైతే అమ్ముకుందాం.. డబ్బులొస్తాయి అని మురిసిన రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఆరుగాళం కష్టపడి రక్తం దారబోసి పంట పండిస్తే.. ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఊడ్చుకుపోయింది. ఎటు చూసినా రైతుల కన్నీళ్లే.. గుండెలు పిండేసే బాధలే.. ఈ హృదయవిదారకర ఘటన హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కనిపించింది. భీకర వర్షానికి మార్కెట్ యార్డులోకి భారీగా వాన నీళ్లు వచ్చి వడ్లు మొత్తం కొట్టుకుపోయి నాళాలో పడ్డాయి. ఒక్కటంటే ఒక్క వడ్ల గింజ కూడా చేతికి దక్కలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ యార్డులో ఏ మూలకు వెళ్లినా తలకు చేతులు పెట్టుకుని ఏడుస్తున్న రైతులే కనిపిస్తున్నారు.
Read Also : Telangana BJP : అజారుద్దీన్ కి మంత్రి పదవి.. ఫిర్యాదు చేయనున్న బీజేపీ
Also Read
సిద్దిపేట కలెక్టర్ హైమావతి పంట నష్టాన్ని పరిశీలించేందుకు మార్కెట్ యార్డుకు రాగా.. రైతులు ఆదుకోవాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ మహిళారైతు నాళాలో కొట్టుకుపోయిన తన వరి ధాన్యాన్ని చూపిస్తూ కలెక్టర్ కాళ్ల మీద పడి ఏడ్చింది. తనను ప్రభుత్వమే ఆదుకోవలంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పంట నష్టం వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Read Also : Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు..
తాజావార్తలు
-
Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
-
Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!
-
Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్కు షాకింగ్ అప్డేట్!
-
Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!
-
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!