సంక్రాంతికి విడుదల కాబోతున్న రెండు భారీ సినిమాలకు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ ధరలు, అదనపు షోస్ ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండుగ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులన సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు చిత్ర నిర్మాతలు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రాలకు సాధారణ ధరలతో వసూళ్లు రాబట్టడం కష్టమని ఆ ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసారు.
తమ చిత్రాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు మరియు అదనపు షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని, ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతల తరపు న్యాయవాదులు పిటిషన్లో కోరారు. సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నందున ఈ కేసు నేడు విచారణను రానుంది. నేడు హైకోర్టులో జరిగే విచారణపై చిత్ర నిర్మాతలతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.కోర్టు సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టుస్వాగతిస్తే మాత్రం నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టాలు తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేడు జరగబోయే విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఎలా ఉంటుందోననే టెన్షన్ నిర్మాతలతో పాటు ఇటు ఫ్యాన్స్ లోను ఉంది.