Chandrababu Arrest Case: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఇవాళ( బుధవారం ) కొనసాగుతుంది. ఉదయం విచారణ జరగ్గా.. దాన్ని మధ్యాహ్నానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇక వాయిదా అనంతరం తిరిగి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం అయింది. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ అధికారులు చంద్రబాబును 5 రోజులు కస్టడీకి కోరారు. రూ. 371 దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.. సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందనే చంద్రబాబు కస్టడీని అడ్డుకుంటున్నారు అంటూ సీఐడీ తరపు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
Read Also: Turkey On Kashmir: టర్కీ బుద్ధి వంకర.. యూఎన్లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఎర్డోగాన్
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
అయితే, కస్టడీ పిటిషన్ తర్వాత మిగిలిన పిటిషన్లపై విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు క్లారిటీ ఇచ్చింది. అన్ని పిటిషన్లు ఒకేసారి విచారించాలని ఒత్తిడి తీసుకురావొద్దని ఏసీబీ న్యాయమూర్తి పేర్కొన్నారు. పీటీ వారెంట్ల విచారణ ఇప్పుడు ముఖ్యం కాదని కోర్టు తెలిపింది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ఫైబర్ గ్రిడ్ పీటీ వారంట్లపై కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
Read Also: Constitution:కలకలం రేపుతున్న రాజ్యాంగం కొత్త కాపీలు.. అసలేమైంది..?
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 22వ తేదీ వరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు. దీంతో కస్టడీ పిటిషన్ పై తొలుత విచారణ చేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవద్దని ఆదేశించింది. ఇక, హైకోర్టు ఆదేశాలు ఈ నెల 18వ తేదీ వరకే వర్తిస్తాయి. దీంతో ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ తర్వాత విచారణ జరపాలని ఇరు వర్గాల లాయర్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!