Chandrababu Arrest Case: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఇవాళ( బుధవారం ) కొనసాగుతుంది. ఉదయం విచారణ జరగ్గా.. దాన్ని మధ్యాహ్నానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇక వాయిదా అనంతరం తిరిగి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం అయింది. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ అధికారులు చంద్రబాబును 5 రోజులు కస్టడీకి కోరారు. రూ. 371 దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.. సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందనే చంద్రబాబు కస్టడీని అడ్డుకుంటున్నారు అంటూ సీఐడీ తరపు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
Read Also: Turkey On Kashmir: టర్కీ బుద్ధి వంకర.. యూఎన్లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఎర్డోగాన్
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
అయితే, కస్టడీ పిటిషన్ తర్వాత మిగిలిన పిటిషన్లపై విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు క్లారిటీ ఇచ్చింది. అన్ని పిటిషన్లు ఒకేసారి విచారించాలని ఒత్తిడి తీసుకురావొద్దని ఏసీబీ న్యాయమూర్తి పేర్కొన్నారు. పీటీ వారెంట్ల విచారణ ఇప్పుడు ముఖ్యం కాదని కోర్టు తెలిపింది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ఫైబర్ గ్రిడ్ పీటీ వారంట్లపై కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
Read Also: Constitution:కలకలం రేపుతున్న రాజ్యాంగం కొత్త కాపీలు.. అసలేమైంది..?
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 22వ తేదీ వరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు. దీంతో కస్టడీ పిటిషన్ పై తొలుత విచారణ చేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవద్దని ఆదేశించింది. ఇక, హైకోర్టు ఆదేశాలు ఈ నెల 18వ తేదీ వరకే వర్తిస్తాయి. దీంతో ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ తర్వాత విచారణ జరపాలని ఇరు వర్గాల లాయర్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..