Chandrababu Arrest Case: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఇవాళ( బుధవారం ) కొనసాగుతుంది. ఉదయం విచారణ జరగ్గా.. దాన్ని మధ్యాహ్నానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇక వాయిదా అనంతరం తిరిగి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం అయింది. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ అధికారులు చంద్రబాబును 5 రోజులు కస్టడీకి కోరారు. రూ. 371 దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.. సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందనే చంద్రబాబు కస్టడీని అడ్డుకుంటున్నారు అంటూ సీఐడీ తరపు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
Read Also: Turkey On Kashmir: టర్కీ బుద్ధి వంకర.. యూఎన్లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఎర్డోగాన్
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
అయితే, కస్టడీ పిటిషన్ తర్వాత మిగిలిన పిటిషన్లపై విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు క్లారిటీ ఇచ్చింది. అన్ని పిటిషన్లు ఒకేసారి విచారించాలని ఒత్తిడి తీసుకురావొద్దని ఏసీబీ న్యాయమూర్తి పేర్కొన్నారు. పీటీ వారెంట్ల విచారణ ఇప్పుడు ముఖ్యం కాదని కోర్టు తెలిపింది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ఫైబర్ గ్రిడ్ పీటీ వారంట్లపై కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
Read Also: Constitution:కలకలం రేపుతున్న రాజ్యాంగం కొత్త కాపీలు.. అసలేమైంది..?
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 22వ తేదీ వరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు. దీంతో కస్టడీ పిటిషన్ పై తొలుత విచారణ చేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవద్దని ఆదేశించింది. ఇక, హైకోర్టు ఆదేశాలు ఈ నెల 18వ తేదీ వరకే వర్తిస్తాయి. దీంతో ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ తర్వాత విచారణ జరపాలని ఇరు వర్గాల లాయర్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
-
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!