Winter Tips : చలికి మీ పిల్లల ముక్కు రంధ్రాలు బ్లాక్ అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
health tips for children in winter
చలికాలం వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. సమస్యలని పెద్దవారు తట్టుకుంటారు కానీ పిల్లలు అంత త్వరగా తట్టుకోలేరు. అలాంటప్పుడు కొన్ని చిట్కాల ద్వారా సమస్యను త్వరగా తగ్గించవచ్చు. జలుబు వచ్చిందంటే చాలు ఒక పట్టాన వదలదు. దీనివల్ల ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతుంటారు. పెద్దలే సమస్యను భరించడం చాలా కష్టం. ఇక పిల్లలు ఎలా తట్టుకుంటారు? అందుకే సమస్యను భరించలేక ఏడుస్తూ ఉంటారు. అదే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని మందులు వేసినా పిల్లలకి త్వరగా జలుబు తగ్గదు. అలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలను వాడటం వల్ల త్వరగా జలుబు తగ్గుతుంది.
Also Read
Read Also : Bigg boss 6: కెప్టెన్సీ ఓటింగ్… మీమాంసలో ఆ ఇద్దరూ!
పిల్లలకు జలుబు వచ్చిందంటే ముక్కు బ్లాక్ అయి, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు పేరెంట్స్ వారికి విక్స్ లాంటివి రాస్తూ ఉంటారు. అయినప్పటికీ అంతగా ఎఫ్టెక్టీవ్గా ఉండదు. అలాంటప్పుడు ఆవిరి పట్టండి. దీనివల్ల పిల్లలకి త్వరగా ఉపశమనం కలుగుతుంది. దీనికోసం గిన్నెలో కొద్దిగా వేడినీరు తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, నీలగిరి తైలం వేసి ఆవిరి పట్టించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకి త్వరగా జలుబు తగ్గుతుంది. అయితే నీరు మరీ వేడిగా ఉండకూడదు. ఎందుకంటే పిల్లలు తట్టుకోలేరు.
Read Also : Spanish Paper: దుమారం రేపుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై స్పానిష్ పేపర్ కథనం
విశ్రాంతి అనేది చాలా అవసరం. దగ్గు, జలుబులతో పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి ఎక్కువగా నిద్ర పోనివ్వండి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జలుబు పిల్లలను అలసిపోయి ఎలా చికాకు కలుగజేస్తుంది? పిల్లలు హాయిగా విశ్రాంతిని తీసుకున్నప్పుడు వారిని ఇబ్బంది పెట్టె జలుబు త్వరగా తగ్గుతుంది. కాబట్టి ఈ సమయంలో పిల్లలకి ఎక్కువ విశ్రాంతి అవసరం. విషయాన్ని తల్లితండ్రులు గుర్తు పెట్టుకోవాలి. రోజు కంటే ఎక్కువ సమయం వారు నిద్రపోయే ఎలా చూసుకోవాలి. దీనితో చాలా వరకు సమస్య తగ్గుతుంది.
Read Also : Womens Asia Cup : కప్ మనదే.. ఫైనల్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం
వేడినీటితో స్నానం చలి వాతావరణం జలుబు ఎక్కువ అయ్యేలా చేస్తుంది. కాబట్టి పిల్లలు ఉండే ప్రాంతం తేమగా కాకుండా ఉష్ణోగ్రత వేడిగా ఉండేలా చూసుకోండి. ఇలాంటి వాతావరణంలో ఉంటే త్వరగా జలుబు తగ్గుతుంది. పసుపు, పాలు వేడి పాలలో చిటికెడు పసుపు వేసి తాగిస్తే పిల్లలకు జలుబు నుంచే వెంటనే ఉపశమనం ఉంటుంది. కాబట్టి రోజు రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలల్లో పసుపు వేసి తాగించండి. దీనివల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా మిరియాల పాలు కూడా పిల్లలకి ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే కొంతమంది పిల్లలు ఘాటు ని తట్టుకోలేరు కాబట్టి ఈ విషయాన్ని గమనించి పిల్లలకు పాలు తాగించడం.
Read Also : ఈ మందులు శృంగార సామర్థ్యాన్ని తగ్గించొచ్చు.. జర జాగ్రత్త!
పిల్లల వయస్సు ఎక్కువగా ఉంటే సెలైన్ డ్రాప్స్ ద్వారా ముక్కుని క్లీన్ చేయొచ్చు. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగిన నీటిలో తేనె కలిపి పిల్లలతో తాగించాలి. అదేవిధంగా పిల్లలు అదే పనిగా దగ్గుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఎలాంటి ఇంగ్లీష్ మందులు పనిచెయ్యవు. అప్పుడు కాసింత వాముని మెత్తగా దంచి చిటికెడు పరిమాణంలో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు త్వరగా జలుబు తగ్గుతుంది.
అదేవిధంగా జలుబును తగ్గించడంలో తులసి కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలకి తులసి ఆకులతో టీ పెట్టి తాగించాడు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా దాల్చిన చెక్క పొడి, తేనెలను వేసి బాగా కలిపి తాగించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా జలుబు తగ్గుతుంది. యూకలిప్టస్ నూనె వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెతో పిల్లల తల, ముక్కు, ఛాతీ భాగంలో బాగా మర్దన చేయడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ఈ నూనెను అప్పుడప్పుడు వాసన చూపించడం వల్ల కూడా మంచి ఉపశమనం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు వాసన చూపించడం మంచిది.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!