Health Department: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై నేడు (గురువారం) వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Also: Snake Gourd Farming: పొట్టి పొట్లకాయ సాగులో మెళుకువలు..!
Also Read
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలు.. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.. రాష్ట్రంలో ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవు అని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.. ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునేలా దవాఖానలు సిద్ధంగా ఉండాలన్నారు. జ్వర బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలి.. ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్యలు చేపట్టాలి అని పేర్కొన్నారు.
Read Also: CPI Narayana: చంద్రబాబును అరెస్ట్ చేయించింది బీజేపీ ప్రభుత్వమే..
జ్వరాలు నమోదయ్యే చోట పల్లె, బస్తీ దవాఖానలను అప్రమత్తం చేయాలి.. ల్యాబ్ రిపోర్టులను కచ్చితంగా 24 గంటల్లోగా అందించాలి.. అయితే ఒకవేళ రోగికి అనుమానిత లక్షణాలు ఉంటే రిపోర్టుల కోసం ఎదురుచూడకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలి.. అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలకు జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి.. జిల్లాల్లో 24 గంటల కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేయాలన్నారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి.. మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
Read Also: VK Singh: పాకిస్థాన్ను ప్రపంచం నుంచి వేరు చేయాల్సిందే.. సంచలన వ్యాఖ్యలు
ములుగు జిల్లాలో డెంగీతో వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొన్ని మీడియా సంస్థల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని జిల్లా అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జిల్లాలో వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ, ఇంటింటి సర్వే, జ్వరాలపై అవగాహన చేపట్టామన్నారు. ఇప్పటివరకు 398 క్యాంపులు నిర్వహించి 24,678 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో 1392 మంది జ్వరబాధితులను, 28 మంది మలేరియా బాధితులను గుర్తించామన్నారు. ఈ నెలలో డెంగీతో నలుగురు మరణించారని చెప్పారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు వివరించారు.
తాజావార్తలు
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?