Health Crisis In Srilanka: శ్రీలంకలో ఆరోగ్య సంక్షోభం.. హస్పటల్స్కి తాళాలు
- శ్రీలంకలో తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం.. దేశం విడిచి పారిపోతున్న వైద్యులు..
- ఇప్పటికే శ్రీలంక వ్యాప్తంగా మూతపడిన 100 ఆస్పత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Crisis In Srilanka: పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తర్వాత ఇప్పుడు ఆరోగ్య సంక్షోభం తీవ్రమైంది. గత రెండేళ్లలో మొత్తం వైద్యుల జనాభాలో 10 శాతం (1700 మంది) వైద్యులు దేశం విడిచి పారిపోయిన పరిస్థితి ఏర్పాడింది. శ్రీలంక వైద్యులు దేశం విడిచి వెళ్లడంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. కోవిడ్ నుంచి అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్న శ్రీలంకలోని ప్రజలు చికిత్స కూడా పొందలేకపోతున్నారు. అయితే, రాజధాని కొలంబోకు ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనురాధపుర టీచింగ్ హాస్పిటల్లోని పిల్లల వార్డును వైద్యుల కొరత కారణంగా క్లోజ్ చేశారు. కొలంబోకు ఆనుకుని ఉన్న మరో ఆసుపత్రిలో, అనస్థీషియా విభాగంలో వైద్యుల కొరతతో అన్ని రకాల ఆపరేషన్లు, ఎమర్జెన్సీ కేసులు వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా 100కి పైగా ఆసుపత్రులు మూసివేత అంచున ఉన్నాయనే విషయాన్ని అల్ జజీరా యొక్క నివేదికలో శ్రీలంక ఆరోగ్య మంత్రి రమేష్ పతిరానా తెలిపారు.
Read Also: Bihar Political Crisis : బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ(వీడియో)
Also Read
- Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
ఇక, శ్రీలంకను విడిచిపెట్టి విదేశాలకు వెళ్తున్న వైద్యులు తమకు దేశంలో డబ్బు, గౌరవం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. పైగా, అధిక ద్రవ్యోల్బణం కారణంగా వారు క్లిష్ట పరిస్థితుల్లో జీవించవలసి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో వైద్యులు ఇప్పుడు తమ భవిష్యత్త్, పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు.. అందుకే వారు దేశం విడిచి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అని వెల్లడైంది. కాగా, కోవిడ్ మహమ్మారి తర్వాత శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తి సంక్షోభంలో చిక్కుకుంది. అ దేశ ప్రజలు ఆహారం, మందులు, ఇంధనం లాంటి అనేక ఇతర నిత్యావసర వస్తువుల కోసం గంటల తరబడి క్యూలలో నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పాడింది. దీనికి వైద్యులు మినహాయింపు కాదు.. కానీ వైద్యులు ప్రత్యేక ఇంధన కోటా కోసం అభ్యర్థించడంతో.. ప్రజా వ్యతిరేకత చెలరేగింది. ప్రస్తుతం శ్రీలంక వైద్యులు అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, ఔషధాల కొరత, ఆహార కొరతను సైతం ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!