HCU: 400 ఎకరాలు తిరిగి రిటర్న్ తీసుకుంటాం.. ఎవరు కొన్నా నష్టపోతారు: కేటీఆర్
- హెచ్సీయూ భూములపై కొనసాగుతోన్న వివాదం
- 400 ఎకరాల భూములపై స్పందించిన కేటీఆర్
- భూములము ఎవరు కొన్నా నష్టపోతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాల భూములపై వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్సీయూకి) చెందినవే అని, వాటిని వేలం వేయొద్దంటూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భూముల వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూడేళ్లలో మరలా అధికారంలోకి వస్తామని, ఆ 400 ఎకరాలు తిరిగి రిటర్న్ తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్సీయూ భూములము ఎవరు కొన్నా నష్టపోతారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘ప్రజల సొమ్మును రక్షించాల్సిన మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అయితే దొంగ లాగా ఎందుకు పోతున్నారు. పది రోజుల సమయం అడిగిన మీరు.. ఎందుకు అంత తొందరగా బుల్డోజర్లు పంపించారు. సెలవులు చూసుకొని వెళ్లి చెట్లు కూల్చుతున్నారు. పేరుకే ప్రజాపాలన, ఎక్కడా కూడా ప్రజాస్ఫూర్తి లేదు. పశ్చిమ హైదరాబాద్లో కేవలం 2500 ఎకరాలు మాత్రమే ఉంది. దీనిని ఎందుకు పాడు చేస్తున్నారు. ఈ విషయంపై కేసీఆర్ హైదరాబాద్ నాయకులతో చర్చించారు. హైదరాబాద్కు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెర లేపాము. అప్పుడు హైదరాబాద్కు గ్రీన్ సిటీ అవార్డ్ వచ్చింది. మా హయాంలో దేశంలో అన్ని రాష్ట్రాలలో కెల్లా తెలంగాణలో గ్రీన్ కవర్ పెరిగింది. అందుకే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల లో మరలా అధికారంలోకి వస్తాం. రాగానే ఆ 400 ఎకరాలు తిరిగి రిటర్న్ తీసుకుంటాం. ఆ 400 ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు చేస్తాము. ఆ భూములు ఎవరు కొనుకున్నా నష్టపోతారు. ముందే చెబుతున్నాం, తర్వాత ఎవరూ మమ్మల్ని అడగొద్దు’ అని కేటీఆర్ హెచ్చరించారు.
Also Read
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
‘మేము అధికారం లో ఉన్నప్పుడు రోహిత్ వేముల విషయంలో హెచ్సీయూకి రాహుల్ గాంధీ వస్తే మేము ఎస్కార్ట్ ఇచ్చాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది చూడండి. రాహుల్ గాంధీ ఒకసారి మీ ప్రభుత్వానికి చెప్పండి, దేశం అంతా కోడై కూస్తున్నా ముఖ్యమంత్రికి కనిపించడం లేదు. మరోసారి చెబుతున్నాం, ఈ ల్యాండ్ కోసం ఎవరూ కూడా వేలంలో పాల్గొనకండి. ఇది హైదరాబాద్ ప్రజల అస్థి. ఈ 400 ఎకరాలు కాపాడే బాధ్యత మాది. మంత్రులకు విషయం తెలియక మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గర మెప్పు కోసం, 20-30 శాతంల కోసం మాట్లాడుతున్నారు. బండి సంజయ్ ఐటమ్ నెంబర్ సిక్స్. కేంద్ర ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో చూసుకోవాలి. తంబాకు తింటూ తిరిగితే బండి సంజయ్ కు ఏమి తెలుస్తుంది’ అని కేటీఆర్ విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..