Aadi Srinivas : హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉంది
- హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడింది
- అనర్హత పైన సర్వాధికారులు స్పీకర్కు ఉన్నాయని కోర్టు తేల్చింది
- తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడిందని, అనర్హత పైన సర్వాధికారులు స్పీకర్ కు ఉన్నాయని కోర్టు తేల్చిందన్నారు ఆది శ్రీనివాస్. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించిందని, నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారని, రాజ్యాంగం ప్రకారం సభాపతి నడుచుకుంటారన్నారు ఆది శ్రీనివాస్. కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయంలో ఎగిరెగిరి పడ్డారని, అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లు గా హడావిడి చేశాడని ఆయన మండిపడ్డారు. చేసిన పాపం గోచిలో పెట్టుకొని కాశీ కి పోయినట్లు కేటీఆర్, బీఆర్ఎస్ నేతల తీరు ఉంది అని ఆయన హెద్దెవ చేశారు. 10 యేళ్ల పాటు రాజ్యాంగాన్ని అపహస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60 మంది కి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లను బీఆర్ఎస్ చేర్చుకుందన్నారు ఆది శ్రీనివాస్.
Stock Market: స్టాక్ మార్కెట్కు సరికొత్త జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే లను క్యాబినెట్ లో చేర్చుకొని నైతిక విలువ లను కాళేశ్వరంలో కలిపారని, పార్టీలకు పార్టీలను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారన్నారు. అంతేకాకుండా..ప్రతిపక్ష పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్ లెక్కచేయలేదు.. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఫిరాయింపులు చేసుకోవచ్చునని నిర్లజ్జగా చెప్పుకొని తిరిగారు.. అధికారం పోయిన తర్వాత రాజ్యాంగం, న్యాయస్థానాలు గుర్తుకు వచ్చాయి… భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం… ఐదారుగురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ లో ఉండరు… కేసీఆర్ ఫామ్ హౌస్ కు, కేటీఆర్ గెస్ట్ హౌస్ కు, హరీష్ రావు నార్సింగి హౌస్ కు పరిమితం కావాల్సిందే అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
Mumbai 26/11 attack: భారత్కి అప్పగింతను వ్యతిరేకిస్తూ, యూఎస్ సుప్రీంకోర్టుకు ఉగ్రవాది రానా..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!