Arikomban : రేషన్ షాపుకు వెళ్లిన ఏనుగు.. బియ్యం లేవన్న కోపంతో ఏంచేసిందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arikomban :కేరళలోని ఇడుక్కి జిల్లాలోని సంతన్పర ప్రాంత ప్రజలకు ఈ ఏనుగు కొంతకాలంగా తలనొప్పిగా మారింది. బియ్యాన్ని ఇష్టపడే ఏనుగు బీభత్సం సృష్టించిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ ఏనుగు తనకు ఇష్టమైన బియ్యాన్ని వెతుక్కుంటూ శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని ఓ ఎస్టేట్లో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లింది. అక్కడ బియ్యం కనిపించకపోవడంతో ధ్వంసం చేసింది. ఈ మేరకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బియ్యం (అరి) తినడాన్ని ఇష్టపడడం కారణంగా ఏనుగును స్థానికులు ‘అరికొంబన్’ అని పిలుస్తారు. స్థానిక భాషలో ‘అరి’ అంటే బియ్యం.. ‘కొంబన్’ అంటే ఏనుగు.
Read Also: Chittah Reintroduction Project : మరో 12చిరుతలొస్తున్నాయ్..
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
అయితే ఈ రేషన్ దుకాణం ఏనుగుల సంప్రదాయ మార్గంలో ఉందని వన్యప్రాణి అధికారులు తెలిపారు. అదే ఏనుగు రేషన్ షాపుపై దాడి చేసిందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. పన్నీర్ ఎస్టేట్లోని రేషన్ షాపుపై గత 10 రోజుల్లో నాలుగుసార్లు ఏనుగు దాడి చేసిందని, అయితే శుక్రవారం తెల్లవారుజామున దుకాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని దుకాణ యజమాని ఆంటోని తెలిపారు.
Read Also: Meat Ban: ఎయిర్ పోర్టుకు 10కి.మీ పరిధిలో మాంసం విక్రయాలు బంద్
రేషన్ దుకాణంలో ఉంచిన బియ్యం, ఇతర వస్తువులను ఏనుగు తినేస్తోందని దుకాణదారు తెలిపారు. ఈసారి దాడి జరుగుతుందని ముందే ఊహించి షాపులోని వస్తువులన్నీ వేరే గదిలోకి మార్చినట్లు తెలిపారు. ఏనుగుకు దుకాణంలో తినడానికి ఏమీ దొరక్కపోవడంతో దుకాణాన్ని ధ్వంసం చేసిందని ఆంటోనీ తెలిపారు. ఏనుగు తరచూ చిన్న చిన్న దుకాణాలపై దాడి చేస్తుందని, ఇనుప తాళాలు పగుల గొట్టి మరీ బియ్యం తింటుందని తెలిపారు. దీని కోసం ఏనుగు తన తొండాన్ని వాడుతుందని వారు తెలిపారు. బియ్యంతో పాటు పంచదార, గోధుమలు కూడా ఏనుగులకు ఇష్టమైన ఆహారమని ఆంటోనీ చెప్పారు.
Read Also: Teddy Love : విచిత్రమైన ప్రేమకథ.. భర్త పోయాక పదేళ్లుగా అన్నీ టెడ్డీ బేర్తోనే..
‘అరికొంబన్’తో పాటు మరో రెండు ఏనుగులు ఈ ప్రాంతంలోని దుకాణాలపై కూడా దాడి చేస్తున్నాయని, వీటిని స్థానికులు ‘చక్కకొంబన్’, ‘మురళీవలన్’ అని పిలుస్తారని ఆయన వివరించారు. ఏనుగులు దుకాణాలపై ఎందుకు దాడి చేస్తాయి? దీనిపై పుణ్యవేల్ అనే గ్రామస్థుడు స్పందిస్తూ.. ఈ జంతువులు బియ్యం రుచి మరిగాయని వాటిని వెతుక్కుంటూ తరచూ వస్తుంటాయని తెలిపారు. ఇటీవలే మరో ఏనుగు దాడికి గురైన చొక్కనాడ్ ఎస్టేట్లో పుణ్యవేల్ రేషన్ దుకాణం ఉంది. రెండేళ్లుగా పాలక్కాడ్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ‘పాలక్కాడ్ ఏనుగు-7’ లాంటి ఈ ఏనుగులను పట్టుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆయన అన్నారు. పాలక్కాడ్ ఏనుగు-7 గత ఆదివారం పట్టుబడింది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!