Patna campu: కాలేజీలో దారుణం.. పాత కక్షలతో విద్యార్థి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాట్నా కాలేజీలో దారుణం జరిగింది. బీఎన్ కాలేజీలో ఒకేషనల్ కోర్సులో ఇంగ్లీస్ చదువుతున్న థర్డ్ ఇయర్ విద్యార్థి హర్ష్ రాజ్(22)ను ముసుగులు ధరించిన 10-15 మంది దుండగులు కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాని నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది దాండియా సందర్భంగా జరిగిన గొడవకు చెందిన పాత కక్షతో యువకుడి జీవితాన్ని అగంతకులు బలి తీసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సోమవారం పరీక్ష రాయడానికి సుల్తాన్గంజ్ లా కాలేజీకి రాగా.. అక్కడ ముసుగులు ధరించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హర్ష్ రాజ్ ప్రాణాలు వదిలాడు.
Also Read
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
- Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
ఇది కూడా చదవండి: Rashmika: నీయబ్బ, ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది!
గతేడాది దసరా సందర్భంగా జరిగిన దాండియా కార్యక్రమంలో జరిగిన గొడవతో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగిందని.. ఆ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుందన్నారు. ఆ నాటి ఘర్షణే ఈ హత్యకు దారితీసిందని పేర్కొన్నారు. 302 సెక్షన్ (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసును విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. ఇక ప్రధాన నిందితుడు చందన్ యాదవ్ నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. మిగతా నిందితుల్ని పట్టుకునేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ దాడికి జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాలలోని ఫుటేజీని పోలీసులు సేకరిస్తున్నారు. బాధితుడ్ని దుండగులు కర్రలతో కొట్టినట్లుగా వీడియోలో కనిపించింది. విజువల్స్లో ఉన్న మిగతా నిందితుల్ని కూడా పట్టుకుంటామని వెల్లడించారు. విద్యార్థి హత్య బాధాకరమని బీహార్ మంత్రి అశోక్ చౌదరి తెలిపారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Praja Bhavan: ప్రజా భవన్కు బాంబు బెదిరింపు.. పోలీసుల విస్తృత తనిఖీలు
ఈ ఘటనపై నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ-జేడీయూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది చాలా దురదృష్టకరమని.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని ధ్వజమెత్తాయి. పరిపాలన చేతగావడం లేదని… దోషులను త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Haryana: ఇదేందయ్యా ఇది..పోర్షే లగ్జరీ కారులో ఎండుగడ్డి తీసుకెళ్లిన రైతు
#WATCH | Patna: On a student beaten to death in a college in Patna, Former Bihar Deputy CM and RJD leader Tejashwi Yadav says, " It is very sad, law and order is deteriorating since NDA govt has come to power (in Bihar)…strictest action must be taken against the accused and… pic.twitter.com/u5UVHDyBV7
— ANI (@ANI) May 28, 2024
తాజావార్తలు
-
iPhone 18, iPhone 18 Pro: ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్పై లీకులు.. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు!
-
Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..