Harish Rao: ఈ-కార్ రేసు వ్యవహారంలో ఎక్కడా అవినీతి జరగలేదు.. ఇది డొల్ల కేసు
- రేవంత్రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది-హరీష్రావు
- ఇది డొల్ల కేసు అని హైకోర్టే చెప్పింది-హరీష్రావు
- సీఎం రేవంత్రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు-హరీష్రావు
- అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు-హరీష్రావు
- సభలో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు-హరీష్రావు.
ఈ-కార్ రేసు వ్యవహారంలో ఎక్కడా అవినీతి జరగలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో హై కోర్టు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అని చెప్పిందని హరీష్ రావు తెలిపారు. ఇది డొల్ల కేసు అని మొదట్లోనే తేలిపోయిందని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడారని అన్నారు. తమను సభలో మాట్లాడనివ్వలేదని హరీష్ రావు తెలిపారు. ఈ-కారు రేసులో రూ. 600 కోట్ల అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రూ.600 కోట్ల నష్టం కాదు.. రాష్ట్రానికి రూ.600 కోట్ల లాభం జరిగేదన్నారు. ఈ-కార్ రేసు వల్ల మన రాష్ట్రానికి లాభం జరిగిందని హరీష్ రావు చెప్పారు. నేల్సన్ అనే సంస్థే రాష్ట్రానికి లాభం జరిగిందని చెప్పిందని పేర్కొన్నారు.
Kerala High Court: ఆస్పత్రులు ‘‘ఆధునిక సమాజంలో దేవాలయాలు’’.. దాడులు చేస్తే సహించొద్దు..
Also Read
ఈ-కార్ రేసు వ్యవహారంలో అవినీతి జరగలేదని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకరే చెప్పారని హరీష్ రావు అన్నారు. అవినీతే జరగలేదని మంత్రి పొన్నం చెప్పినప్పుడు ఇక ఏసీబీ కేసు ఎందుకు అని ప్రశ్నించారు. డబ్బులు డైరెక్ట్గా ట్రాన్స్ ఫర్ అయ్యాయి.. ఇక్కడ అవినీతి ఏముందన్నారు. తెలంగాణ ఇమేజ్ పెరిగే విధంగా ఆనాడు కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని హరీష్ రావు తెలిపారు. గత ప్రభుత్వానికి మంచి పేరు రావొద్దని కేటీఆర్ పై అక్రమంగా కేసు పెట్టారు.. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టారని హరీష్ ఆరోపించారు. హామీలపై ప్రజల దృష్టిని మరల్చి జిమ్మిక్కులు చేస్తున్నారని అన్నారు.
Mumbai: స్కూల్ వార్షికోత్సవంలో ఐశ్వర్య దంపతుల డ్యాన్స్.. వీడియో వైరల్
సీఎం కుటుంబ స్కాంలను కేటీఆర్ బయట పెట్టారు.. ఈ క్రమంలో కేటీఆర్ను ఎలాగైనా జైళ్లో వేయాలని కుట్రలకు తెర లేపారని హరీష్ రావు పేర్కొన్నారు. తమ క్యాడర్లో అయోమయానికి గురి చేయాలని చూశారు.. నీ అవినీతికి కేటీఆర్ అడ్డు వస్తున్నాడని భయ పడుతున్నావని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు చేశారు అని చెబుతున్నారు.. ఒకవేళ ఎన్నికల కోడ్ ఉంటే.. ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందన్నారు. ఏసీబీకి ఏం పని అని హరీస్ రావు ప్రశ్నించారు. ఒకవేళ తప్పు జరిగితే ఆ కంపెనీ పై ఎందుకు కేసు పెట్టలేదు.. దాన కిషోర్ కేసు చెప్పిన 24 గంటల్లో విచారణ లేకుండా కేసు ఎలా పెడతారని హరీష్ రావు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!